నల్లగొండ: నల్లగొండ పట్టణంలోని సీతారామచంద్రస్వామి ఆలయంలో ఆండాళ్ తిరునక్షత్ర ఉత్సవాలు కన్నుల పండువగా జరుగుతున్నాయి. అమ్మవారికి వేదపండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ ఉత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరైన చిన జీయర్ స్వామి ప్రవచనాలు చేశారు. స్వామి సేవలో ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, ఆర్టీఓ జగదీశ్వర్ రెడ్డి, ప్రజాప్రతినిధులు, భక్తులు పాల్గొన్నారు.