ముఖ్యమంత్రి కేసీఆర్ యాదాద్రి భువనగిరి జిల్లాకు ఆదివారం రానున్నారు. ఆలేరు పట్టణంలో నిర్వహించే ప్రజా ఆశీర్వాద సభకు హాజరు కానున్నారు. మధ్యాహ్నం 3గంటలకు జరిగే బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. జిల్లా మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డితోపాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొననున్నారు. పట్టణంలోని ఇండోర్ స్టేడియం ప్రాంగణంలో 30 ఎకరాల్లో బహిరంగ సభ ఏర్పాట్లు చేశారు. ఆలేరు నియోజకవర్గంలో ఎనలేని అభివృద్ధి చేపట్టడంతోపాటు గడప గడపకూ సంక్షేమ ఫలాలు అందిస్తున్న సీఎం కేసీఆర్ను చూసేందుకు, ఏం చెప్తారో వినేందుకు తరలి స్వచ్ఛందంగా సిద్ధమవుతున్నారు.
70వేలకు పైగా వచ్చే అవకాశం ఉన్నదని భావిస్తున్న బీఆర్ఎస్ శ్రేణులు ఆ మేరకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాయి. శనివారం సభా ప్రాంగణాన్ని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్ పరిశీలించారు. బీఆర్ఎస్ బాస్ సభతో ఆలేరు పట్టణం జెండాలు, కటౌట్లతో గులాబీమయమైంది.
ఆలేరు, అక్టోబర్ 28 : ఆలేరు గడ్డపై ఆదివారం జరిగే బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభకు గులాబీ దళపతి, సీఎం కేసీఆర్ రానున్నారు. పట్టణంలో 30 ఎకరాల విస్తీర్ణంలో సభ నిర్వహించనున్నారు. సీఎం కేసీఆర్కు స్వాగతం పలికేందుకు పార్టీ నాయకులు భారీ ఏర్పాట్లు చేశారు. ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్యగౌడ్ జన సమీకరణపై పార్టీ శ్రేణులకు ఇప్పటికే దిశ నిర్దేశం చేశారు. పట్టణంలోని వార్డుల్లో ఎమ్మెల్యే గొంగిడి సునీత, డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్యగౌడ్ ప్రచారాలను ముమ్మరం చేశారు. సీఎం సభకు భారీగా తరలిరావాలని పిలుపునిచ్చారు.
ప్రజా ఆశీర్వాద సభకు వచ్చే వాహనాల ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా పోలీస్ శాఖ ఏర్పాట్లను చేసింది. సభ నాలుగు వైపులా వాహనాలను పారింగ్కు చర్యలు చేపట్టింది. డీసీపీ రాజేశ్చంద్ర, ఏసీపీ శివరాంరెడ్డి ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఆత్మకూరు మోటకొండూర్ నుంచి వచ్చే భారీ వాహనాలను ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం పకన, కార్లను స్టేడియం వద్ద పారింగ్ చేయనున్నారు. యాదగిరిగుట్ట, రాజపేట నుంచి వచ్చే వాహనాలను ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో, తురపల్లి, బొమ్మలరామారం నుంచి వచ్చే వాహనాలను ఆలేరు జేఎంజే సూల్ క్రాస్ రోడ్లో పారింగ్ చేసేలా చర్యలు చేపట్టారు.
ఆలేరు, అక్టోబర్ 28 : రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ హాట్రిక్ విజయం సాధించడం ఖాయమని బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగ బాలు అన్నారు. ఆదివారం ఆలేరులో జరిగే ప్రజా ఆశీర్వాద సభాస్థలాన్ని శనివారం ఆయన పరిశీలించి మాట్లాడారు. ఆశీర్వాదసభకు యువకులు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. బీఆర్ఎస్ ఆలేరు నియోజకవర్గ అభ్యర్థి గొంగిడి సునీతామహేందర్రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించి ముఖ్యమంత్రి కేసీఆర్కు కానుకగా ఇవ్వాలన్నారు. కోమటిరెడ్డి బ్రదర్స్ను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని, వాళ్లు రాజకీయ పబ్బం గడుపుకోవడానికి పూటకో మాట మారుస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. జిల్లా ప్రజలు చాలా చైతన్యవంతులని, ఎవరెన్ని కుట్రలు చేసినా బీఆర్ఎస్ వెంటే ఉంటారని ధీమా వ్యక్తం చేశారు. సభా స్థలాన్ని పరిశీలించిన వారిలో మారెట్ కమిటీ చైర్మన్ జ్యోతీప్రవీణ్, ఆలేరు మున్సిపల్ చైర్మన్ వసుపరి శంకరయ్య, బీఆర్ఎస్ నాయకులు సిద్ధేశ్వర్, బండ జహంగీర్ పాల్గొన్నారు.
ఆలేరు నియోజకవర్గంలోని 8 మండలాల నుంచి 70వేల మంది ప్రజా ఆశీర్వాద సభకు వస్తారని డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి తెలిపారు. వనపర్తి మండలంతోపాటు యాదగిరిగుట్ట, ఆత్మకూరు, తురపల్లి, బొమ్మలరామారం, గుండాల, మోటకొండూరు, రాజాపేట, ఆలేరు మండలాల నుంచి భారీగా జన సమీకరణకు ప్రణాళిక సిద్ధం చేశామన్నారు.