టీఆర్ఎస్(బీఆర్ఎస్)లోకి వలసల పర్వం కొనసాగుతున్నది. వివిధ పార్టీల నుంచి నాయకులు, కార్యకర్తలు చేరుతున్నారు. గురువారం చౌటుప్పల్ మండలం ఖైతాపురంలో పలువురు బీజేపీ, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు.. సంస్థాన్నారాయణపురం మండలానికి చెందిన సుమారు 100 బీజేపీ కుటుంబాలు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్(బీఆర్ఎస్)లో చేరారు. అలాగే చౌటుప్పల్ మున్సిపాలిటీలో ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి ఆధ్వర్యంలో చేరికలు కొనసాగాయి. మర్రిగూడ మండలం ఖుదాభక్ష్పల్లి సర్పంచ్ ఆంబోతు సుధాకర్నాయక్తోపాటు పలువురు కార్యకర్తలు జడ్పీటీసీ పాశం సురేందర్రెడ్డి సమక్షంలో బీజేపీ నుంచి తిరిగి గులాబీ పార్టీలో చేరారు. నాంపల్లి మండలం తుంగపహాడ్కు చెందిన బీజేపీ గ్రామ శాఖ అధ్యక్షుడు జడ్పీటీసీ ఎలుగోటి వెంకటేశ్వర్రెడ్డి సమక్షంలో గులాబీ కండువా కప్పుకొన్నారు. అదే మండలం పెద్దపురం గ్రామానికి చెందిన బీజేపీ, కాంగ్రెస్ నాయకులు టీఆర్ఎస్లో చేరారు.
చౌటుప్పల్ రూరల్, అక్టోబర్ 6 : బీఆర్ఎస్ పార్టీకి కార్యకర్తలే కొండంత బలమని మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి అన్నారు. మండలంలోని ఖైతాపురం గ్రామ బీజేపీ, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గురువారం ఆయన సమక్షంలో టీఆర్ఎస్(బీఆర్ఎస్)లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీలో చేరిన వారికి సముచిత స్థానం కల్పిస్తామన్నారు. పార్టీలో చేరిన వారిలో కొమ్ము మహేశ్, మీసాల లింగస్వామి, కొమ్ము నరేందర్, ప్రశాంత్, మీసాల రవి, గుడ్టేటి బాబు, మీసాల కిష్టయ్య, మీసాల యాదగిరి, గడ్డం ఎల్లయ్య, గడ్డం యాదగిరి, కొమ్ము రాములు, మహేందర్, మైసయ్య, సాయి, ముత్తమ్మ, గాలమ్మ, సువర్ణ ఉన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ బొడ్డు శ్రీనివాస్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ చింతల దామోదర్రెడ్డి, పార్టీ మండలాధ్యక్షుడు గిర్కటి నిరంజన్గౌడ్, నాయకులు చిన్నం బాలరాజు, తగరం వెంకటేశం, గోపనగోని అనిల్యాదవ్, యెల్మ రామలింగేశ్వర్రెడ్డి, బండిగారి లింగస్వామి, గుడ్డేటి రమేశ్, తగరం సతీశ్, ముద్దం బాలరాజు పాల్గొన్నారు.
సంస్థాన్నారాయణపురం : టీఆర్ఎస్(బీఆర్ఎస్)లో చేరిన వారికి గులాబీ కండువాలు కప్పుతున్న మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి
టీఆర్ఎస్(బీఆర్ఎస్)లో పలువురి చేరిక
సంస్థాన్నారాయణపురం : మండల కేంద్రంలోని బీజేపీ సీనియర్ మండల నాయకులు చెదురువెల్లి యాదగిరి, ఉప్పరగోని లింగస్వామి ఆధ్వర్యంలో సుమారు 100కుటుంబాలు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి సమక్షంలో గురువారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ జక్కిడి జంగారెడ్డి, పార్టీ మండలాధ్యక్షుడు కత్తుల లక్ష్మయ్య, నాయకులు మన్నె ఇంద్రసేనారెడ్డి, కూసుకుంట్ల సత్తిరెడ్డి, పల్లె గోవర్ధరెడ్డి, బిక్షం, ఎడ్ల సత్తయ్య పాల్గొన్నారు.