నల్లగొండ రూరల్, ఫిబ్రవరి 04 : నల్లగొండ పట్టణంలోని చర్లపల్లిలో గల ఈద్గా, జామె మస్జీద్ నూతన కమిటీని షబ్ ఏ బరాత్ సందర్భంగా ఎన్నుకున్నారు. ఈ ఎన్నికలో చర్లపల్లి, మర్రిగూడ, పిట్టంపల్లి, ఆర్జాలబావి, అన్నేపర్తికి చెందిన ముస్లింలు పాల్గొన్నారు. ఈద్గా కమిటీ అధ్యక్షుడిగా ఎండీ గులామ్ అహ్మద్, వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎం.ఏ అజీమ్, ఉపాధ్యక్షులుగా ఎండీ షరీఫ్, ఎస్కే యూనుస్, ఎండీ షాయీబ్ ఎన్నికయ్యారు. అదే విధంగా జామె మస్జీద్ కమిటీ అధ్యక్షుడిగా ఎంఏ అజీమ్ ఎన్నిక కాగా ఉపాధ్యక్షులుగా ఎంఏ కరీమ్, ఎంఏ హమీద్ ఎన్నికయ్యారు. జనరల్ సెక్రలరీగా గులామ్ అహ్మద్, జాయింట్ సెక్రటరీలుగా ఎస్కే యూనుస్బాబా, ఎండీ షకీల్, ఎండీ సాదఖ్, ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఎస్కే మహబూబ్, కోశాధికారిగా ఎండీ సమీర్బాబా, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్గా ఎంఏ హబీబ్, ఎంఏ వాహబ్, ఎస్కే హుస్సేన్, షేఖ్ ఆరీఫ్, ఎస్ కే కలీమ్, ఎండీ అఫ్రోజ్, ఎండీ గులామ్ మహ్మద్, ఎంఏ అజీమ్ బాబు, ఎండీ వాహబ్ ఎన్నికయ్యారు. నూతనంగా ఎన్నికైన కమిటీని ఈ సందర్భంగా ముస్లింలు అభినందనలు తెలిపి సన్మానించారు.