హుజూర్నగర్, జూలై 20 : కొన్ని రోజులుగా హుజూర్నగర్ పట్టణంలో భవనాల నిర్మాణానికి ఉపయోగించే సెంట్రింగ్ పేట్ల దొంగతనం చేస్తున్న వ్యక్తులను బుధవారం పోలీసులు అరెస్ట్ చేశారు. హుజూర్నగర్ సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కోదాడ డీఎస్పీ వెంకటేశ్వర్రెడ్డి వివరాలు వెల్లడించారు. హుజూర్నగర్ పట్టణంలో కొన్ని రోజులుగా సెంట్రింగ్ పేట్లు దొంగతనం జరుగుతున్నట్లు ఫిర్యాదులు అందుతున్నాయి.
వాటిపై విచారణ నిర్వహిస్తున్న పోలీసులు తెల్లవారుజామున పట్టణంలో పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా లింగగిరి రోడ్డులో గల జెఎస్ఎస్ పాత ఇనుము దుకాణం వద్ద చిలుకూరు మండలం, సీతారాంపురం గ్రామానికి చెందిన దండుగులశ్రీను, ఓర్సుశివతో పాటు మరో ముగ్గురు బాలురు రెండు ఆటోల్లో సెంట్రింగ్ ప్లేట్లతో పాటు కొంత ఇనుప సామాను తీసుకొచ్చి పాత ఇనుప దుకాణాదారుడు మస్తాన్కు అమ్ముతుండగా పోలీసులు పట్టుకున్నారు. దుకాణంలో డీసీఎం వాహనంలో తరలించేందుకు సిద్ధంగా ఉన్న రూ.5.50లక్షల సెంట్రింగ్ పేట్లను స్వాధీనం చేసుకున్నారు. రెండు ఆటోలను సీజ్ చేశారు. నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు డీఎస్పీ తెలిపారు. కేసును ఛేదించిన ఐడీ పార్టీ సిబ్బంది నాగరాజు, శంభయ్యలకు డీఎస్పీ రివార్డులు అందజేశారు. సమావేశంలో హుజూర్నగర్ సీఐ రామలింగారెడ్డి, ఎస్ఐ కట్టా వెంకట్రెడ్డి పాల్గొన్నారు.