దామరచర్ల, మార్చి 16 : కేంద్ర ప్రభుత్వం గత 13 సంవత్సరాల నుండి పెట్టుబడి వర్గాన్ని పెంచి పోషిస్తుందని, నిరంతరం ప్రజలపై అధిక ధరల భారాన్ని మోపుతుందని సిపిఐ దామరచర్ల మండల కార్యదర్శి పోలేపల్లి ఉదయ్ కుమార్ అన్నారు. సోమవారం రాష్ట్ర పార్టీ పిలుపుమేరకు దామరచర్ల మండల కేంద్రంలో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో పెంచిన గ్యాస్, నిత్యవసరాల ధరలను తగ్గించి సామాన్యులకు అందుబాటులో ఉండే విధంగా చూడాలని డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఉదయ్ కుమార్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలను కాలరాసి, ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసి, ఎప్పటికప్పుడు ధరలను పెంచుకుంటూ పోతూ సామాన్యుడి నడ్డి విరుస్తుందని దుయ్యబట్టారు. ఇకనైనా ధరలను నియంత్రించకపోతే పెద్ద ఎత్తున జన సమీకరణ చేసి దేశవ్యాప్త ఆందోళన చేపడుతామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ సహాయ కార్యదర్శి ధనావత్ శాంత, సీనియర్ నాయకులు జమ్ముల కోటయ్య, గజ్జల లక్ష్మీనరసింహారెడ్డి, భాగం శేషయ్య, శుద్ధబోయిన రాములు, వెంకన్న, వినయ్, యశ్వంత్, రమేశ్, నరసింహ, సాంబ, శివాజీ, రాజు పాల్గొన్నారు.