నల్లగొండ : జిల్లాలోని మిర్యాలగూడ మండలం శ్రీనివాస్ నగర్లో శుక్రవారం స్వచ్ఛ భారత్ అధికార బృందం పర్యటించింది. గ్రామంలో చేపట్టిన పలు అభివృద్ధి పనులను బృందం సభ్యులు పరిశీలించారు. డంపింగ్ యార్డ్లో చెత్త నుంచి ఎరువు తయారీ గురించి అడిగి తెలుసుకున్నారు. వారి వెంట జడ్పీటీసీ విజయసింహారెడ్డి, సర్పంచ్ వెంకటరమణ చౌదరి, ఎంపీటీసీ సుజాత, ఎంపీడీవో జ్యోతి లక్ష్మి, ఎంపీఓ వీరా రెడ్డి, శిరీష పాల్గొన్నారు.