మిర్యాలగూడటౌన్, జనవరి 26 : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలు అవలబిస్తున్నదని రైతు సంఘం జాతీయ నాయకుడు సారంపల్లి మల్లారెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను ఉపసంహరించాలని, రైతులకిచ్చిన హామీలను నెరవేర్చాలని కోరుతూ అఖిల భారత కిసాన్ సభ ఆధ్వర్యంలో గురువారం మిర్యాలగూడలో ట్రాక్టర్ల ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కనీస మద్దతు ధర చట్టాన్ని పార్లమెంట్లో ప్రవేశ పెట్టాలని, రైతులు పండించిన పంటను పూర్తిగా ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు వీరేపల్లి వెంకటేశ్వర్లు, సీపీఎం, సీపీఐ నాయకులు వినోద్నాయక్, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
స్వామినాథన్ సిఫారసులను అమలు చేయాలి
బొడ్రాయిబజార్ : కేంద్ర ప్రభుత్వం స్వామినాథన్ సిఫారసులను వెంటనే అమలు చేసి రైతులకు మద్దతు ధర చట్టాన్ని తీసుకురావాలని ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి అన్నారు. గురువారం సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్ఎంసీ) జాతీయ కమిటీ పిలుపులో భాగంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జనగాం క్రాస్ రోడ్డు నుంచి కొత్త బస్టాండ్ వరకు వామపక్ష రైతు సంఘాల ఆధ్వర్యంలో భారీ ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు.
తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ఉపాధ్యక్షుడు కొప్పోజు సూర్యనారాయణ, అఖిల భారత రైతుకూలీ సంఘం రాష్ట్ర కార్యదర్శి మండారి డేవిడ్కుమార్, తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు బుర్రి శ్రీరారాములు, అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు మట్టిపల్లి అంజయ్య, సీపీఐ ఎంఎల్ రామచంద్రన్ అధికార ప్రతినిది బుద్ద సత్యనారాయణ, ఎంసీపీఐయూ జిల్లా నాయకులు ఏపూరి సోమన్న మాట్లాడారు. కార్యక్రమంలో సీపీఎం, సీపీఐ జిల్లా కార్యదర్శులు మల్లు నాగార్జున్రెడ్డి, బెజవాడ వెంకటేశ్వర్లు, తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి దండ వెంకటరెడ్డి, జిల్లా అధ్యక్షుడు కంబాల శ్రీనివాస్, అఖిల భారత రైతుకూలీ సంఘం జిల్లా కార్యదర్శి బొడ్డు శంకర్, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి నెమ్మాది వెంకటేశ్వర్లు, పాల్గొన్నారు.