కోదాడ, మార్చి 24 : గాలికుంటు వ్యాధి టీకాలతో పశువులను సంరక్షించుకోవాలని కోదాడ మున్సిపల్ చైర్ పర్సన్ ఎర్నేని కుసుమ వెంకటరత్నం బాబు, జిల్లా గ్రంథాలయ చైర్మన్ వంగవీటి రామారావు అన్నారు. బుధవారం కోదాడ పట్టణంలోని ప్రాంతీయ పశు వైద్యశాలలో టీకా జిల్లా ప్రచార రథాన్ని వారు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈ వ్యాధిపై పాడి రైతులకు అవగాహన కలిగించేందుకు రథం ఏర్పాటు చేయబడిందని తెలిపారు. గాలికుంటు టీకా కార్యక్రమం గ్రామ గ్రామాన పశు పోషకులకు ఉపకరిస్తుందన్నారు.. ఇక్కడి వైద్యులు మూగ జీవాలకు సకాలంలో చికిత్సను అందించడం మంచి పరిణామం అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి బోడపూడి శ్రీనివాసరావు, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ తిరుపతమ్మ, మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ మల్లీశ్వరి, అసిస్టెంట్ డైరెక్టర్ పెంటయ్య, కౌన్సిలర్ నాగేంద్రమ్మ, న్యాయవాది కే ఎల్ ఎన్ ప్రసాద్, సిబ్బంది పాల్గొన్నారు.