తిరుమలగిరి(సాగర్), జూన్ 2 : మండలంలోని రంగుండ్ల గ్రామంలో శుక్రవారం బుడియబాపు పెద్దపూజ పండుగను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. వివిధ రాష్ర్టాల నుంచి భక్తులు వేల సంఖ్యలో తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్నారు.
గిరిజనుల ఆరాధ్య దైవంగా భావించే బుడియబాపు గిరిజనులకే కాకుండా అన్నివర్గాల ప్రజలకు తోడుగా ఉండి అందరి కోర్కెలను నెరవేరుస్తున్నాడని దేవస్థానం పీఠాధిపతి ఆంగోతు భగవాన్నాయక్ అన్నారు. ప్రతి సంవత్సవరం జూన్ మొదటి వారంలో ఈ పూజను నిర్వహించనున్నట్లు తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని సౌకర్యాలు కల్పించినట్లు చెప్పారు.