నందికొండ, ఫిబ్రవరి 23 : కృష్ణానది తీరాన పచ్చని వాతావరణంలో అంతర్జాతీయ బౌద్ధ వారసత్వ ప్రమాణాలతో నిర్మించిన బుద్ధవనం దేశ, విదేశీ పర్యాటకులకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నదని ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ ద్వారకా తిరుమలరావు అన్నారు. బుద్ధవనం ప్రత్యేకాధికారి మల్లేపల్లి లక్ష్మయ్య ఆహ్వానం మేరకు నందికొండ హిల్కాలనీలోని బుద్ధవనాన్ని గురువారం ఆయన సందర్శించారు.
ఈ సందర్భంగా తిరుమలరావు మాట్లాడుతూ ప్రశాంత వాతావరణంలో నిర్మించిన బుద్ధవనం మానసిక ప్రశాంతతను కలిగిస్తున్నదన్నారు. వారాంతంలో విజయవాడ నుంచి నందికొండకు ప్రత్యేక బస్సు సౌకర్యాన్ని కల్పించనున్నట్లు తెలిపారు. బుద్ధవనాన్ని గొప్పగా నిర్మించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కు, బుద్ధవనం ప్రత్యేకాధికారి మల్లేపల్లి లక్ష్మయ్యకు ధన్యవాదాలు తెలిపారు. ఏపీ రోడ్డు రవాణా సంస్థ ఈడీ బ్రహ్మానందరెడ్డి, డీఎస్పీ జయరాంప్రసాద్, సీఐలు షమీముల్లా, బాలకృష్ణ, ఎస్ఐ అనిల్కుమార్, నరిసింహారావు, విష్ణు ఉన్నారు.