కట్టంగూర్, మే 15 : ఆదివారం పెట్రోల్ బంక్ లను మూసివేయడాన్ని బహుజన సమాజ్ పార్టీ స్వాగతిస్తుందని ఆ పార్టీ భువనగిరి పార్లమెంట్ ఇన్చార్జి కత్తుల కాన్షీరాం తెలిపారు. శుక్రవారం కట్టంగూర్ మండల కేంద్రంలోని పెట్రోల్ బంక్ ను సందర్శించి అందులో పనిచేసే కార్మికులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికులకు ఒక రోజ విశ్రాంతి కల్పించడం మంచి నిర్ణయమని పేర్కొన్నారు. ఆదివారం వైన్స్, బార్లను కూడా మూసి వేసి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు లింగయ్య, ఉదయ్, కార్తీక్, దినేష్, సంపత్ పాల్గొన్నారు.