యాదగిరిగుట్ట, ఏప్రిల్ 15 : సహకార సంఘంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా రైతాంగానికి అందించిన సేవలకుగానూ జాతీయ స్థాయిలో ఉత్తమ డీసీసీబీ అవార్డు అందుకున్న ఉమ్మడి జిల్లా డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ అభినందించారు. హైదరాబాద్లోని నందినగర్లో సోమవారం కేటీఆర్ను ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత, డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి మర్యాద పూర్వకంగా కలిశారు.