చండూరు, అక్టోబర్ 22 : కార్యకర్తలకు బీఆర్ఎస్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఆ పార్టీ చండూరు మండలాధ్యక్షుడు బొమ్మరబోయిన వెంకన్న అన్నారు. మండలంలోని గుండ్రపల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త కురుపాటి నగేశ్ ఇటీవల గుండెపోటుతో మరణించాడు. బుధవారం పార్టీ మండల నాయకులు నగేశ్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా మండల కమిటీ ఆధ్వర్యంలో రూ.55 వేల ఆర్థిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల మహిళా అధ్యక్షురాలు పెండ్యాల గీత, రాష్ట్ర నాయకులు ఎత్తపు మధుసూదన్ రావు, ఉజ్జిని అనిల్ రావు, బొడ్డు సతీశ్ గౌడ్, కురుపాటి సుదర్శన్, సామ్రాట్ కిరణ్, ఎలువర్తి జంగయ్య, కృపాటి లింగస్వామి, తరి సురేశ్, నాగరాజు, మహేశ్వరం వెంకన్న, లింగస్వామి పాల్గొన్నారు.