దేవరకొండ, అక్టోబర్ 29: బీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ మంగళవారం(రేపు) దేవరకొండలో ని ర్వహించే ప్రజా ఆశీర్వాద సభకు ముమ్మరంగా ఏర్పా ట్లు సాగుతున్నాయి. ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ సమీపంలో నాలుగు వైపుల నుంచి వచ్చే ప్రజలకు అందుబాటులో ఉండటంతో పనులు చురుకుగా సాగుతున్నాయి. నియోజకవర్గంలోని ఎనిమిది మండలాల నుంచి సుమారు 1లక్ష మంది సభకు హాజరయ్యేందుకు రెండు రోజులుగా ఏర్పాట్లు చేస్తున్నారు.
ఒక వైపు వాహనాల పార్కింగ్, మరో వైపు హెలిప్యాడ్ నుంచి 500మీటర్ల వద్ద బహిరంగ సభా వేదికలు ఏర్పాటు చేస్తున్నారు. సభకు వచ్చే బీఆర్ఎస్ శ్రేణులకు ఇక్కట్లు కలగకుండా ఏర్పాట్లుచేస్తున్నారు. 2018 ఎన్నికల సభను కూడా ఇక్కడే నిర్వహించారు. సీఎం సభకు పెద్దఎత్తున జనాన్ని తరలించేందుకు నాయకులు సిద్ధమవుతున్నారు.
చందంపేట : ఈనెల 31న దేవరకొండలో నిర్వహించనున్న సీఎం కేసీఆర్ బహిరంగ సభను విజయవంతం చేయాలని బీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు, ఉపాధ్యక్షులు ముత్యాల సర్వయ్య, యాసాని రాజవర్ధన్రెడ్డి పిలుపునిచ్చారు. మండల కేంద్రంలో ఆదివారం వారు విలేకరులతో మాట్లాడారు. చందంపేట, నేరెడుగొమ్ము మండలాల నుంచి పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ శ్రేణులు సీఎం స భకు తరలిరావాలని కోరారు. బీఆర్ఎస్ మరోసారి అధికారంలోకి వస్తుందని, ఎమ్మెల్యేగా రవీంద్రకుమార్ భారీ మెజార్ట్టీతో గెలుపొందుతారని ధీమా
మాల్: దేవరకొండలో మంగళవారం జరిగే సీఎం సభను విజయ వంతం చేయాలని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు కంకణాల వెంకట్రెడ్డి అన్నారు. చింతపల్లి మండల పరిధిలోని గొడకొండ్ల(మాల్)లో అదివారం ముఖ్యకార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. సభకు ప్రతి గ్రామం నుంచి ప్రజలు భారీగా తరలి రావాలని కోరారు. సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజలకు వివరించాలన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు దొంతం చంద్రశేఖరెడ్డి, బీసీసెల్ మండలాధ్యక్షుడు అశోక్, నా య కులు వెంకటేష్, రమేష్, పులిరాజుగౌడ ఉన్నారు.