కాంగ్రెస్ పార్టీవి అసత్య ప్రచారాలు, ఆరోపణలని, సాధ్యం కాని హామీలతో ప్రజలను మోసం చేయాలని చూస్తున్నదని బీఆర్ఎస్ భువనగిరి అభ్యర్థి, ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి అన్నారు. వలిగొండ మండలం మల్లేపల్లి, భువనగిరి పట్టణంలో ఆదివారం ఆయన రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పైళ్ల మాట్లాడుతూ బీఆర్ఎస్ పాలనలో ప్రతి కుటుంబం ఏదో ఒక రూపంలో సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందుతున్నదన్నారు.
సీఎం కేసీఆర్ సారథ్యంలోనే సుస్థిర ప్రభుత్వం ఉంటుందని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి రాకముందే ఆ పార్టీ నాయకులు ముఖ్యమంత్రి కుర్చీ కోసం కొట్లాడుతున్నారని, ప్రజల విశ్వాసం కోల్పోయారని చెప్పారు. మైనారిటీల సంక్షేమానికి బీఆర్ఎస్ ప్రభుత్వం పలు కార్యక్రమాలు చేపట్టిందని తెలిపారు.
వలిగొండ, నవంబర్ 26 : కాంగ్రెస్ నాయకులు చెప్పే అసత్య ప్రచారాలు, కల్లబొల్లి మాటలు నమ్మితే గోసపడుతామని, ప్రజలు ఆలోచించి కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని మల్లేపల్లిలో నిర్వహించిన రోడ్ షోలో ఆయన పాల్గొని మాట్లాడారు. అభివృద్ధి కోసం బీఆర్ఎస్కి ఓటు వేసి గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ అధికారంలోకి రాకముందే సీఎం కుర్చీ కోసం నాయకుల మధ్య కొట్లాట మొదలైందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో సుస్థిర ప్రభుత్వం ఏర్పడుతుందన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో సంక్షేమ పథకాలతో లబ్ధిపొందని కుటుంబం లేదని, ఇక్కడి పథకాలను ఇతర రాష్ర్టాలు అమలు చేయాలని చూస్తున్నాయన్నారు. రైతుల సంక్షేమం కోసం 24 గంటల ఉచిత కరెంట్, రైతు బంధు సాయాన్ని రూ.16వేలకు పెంచి అందించబోతున్నామన్నారు. భువనగిరి నియోజక వర్గం అభివృద్ధి కోసం కారుగుర్తుకు ఓటు వేసి మరోసారి ఆశీర్వదించాలని కోరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు చింతల వెంకటేశ్వర్రెడ్డి,
ఏఎంసీ చైర్మన్ పైళ్ల రాజవర్ధన్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ సుర్కంటి వెంకట్రెడ్డి, రైతు బంధు సమితి మండల కన్వీనర్ పనుమటి మమతానరేందర్రెడ్డి, ఎంపీటీసీ పల్సం రమేశ్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు తుమ్మల వెంకట్రెడ్డి, మాజీ ఎంపీపీ శ్రీరాముల నాగరాజు, జడ్పీటీసీ మొగుళ్ల శ్రీనివాస్, ముద్దసాని కిరణ్రెడ్డి, అయిటిపాముల ప్రభాకర్, సత్యనారాయణ, రవీందర్, మామిండ్ల రత్నయ్య, గంగధారి రాములు, కొమురయ్య, బుంగమట్ల సుధాకర్, రాంచందర్, ఈతాప నర్సింహ, యార శ్రీశైలం పాల్గొన్నారు.