హాలియా, నవంబర్ 22: జానారెడ్డి 35 ఏండ్లు ఎమ్మెల్యేగా, 16 ఏండ్లు మంత్రిగా ఉండి కూడా నాగార్జునసాగర్ నియోజకవర్గ అభివృద్ధికి చేసిందేమీ లేదని బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే నోముల భగత్కుమార్ ఆరోపించారు. శుక్రవారం అనుముల మండలంలోని తిమ్మాపురం, కాశివారిగూ డెం, తిమ్మాపురం, యాచారం, మారేపల్లి, అ న్నారం, పులిమామిడి,ముక్కమాల, కుపాసిపల్లి, కేకే కాల్వ, మార్గగడ్డగూడెం, బంటువారిగూడెం, శ్రీనాథపురం, చింతగూడెం, రామడుగు, పాలెం లో ట్రైకార్ చైర్మన్ ఇస్లావత్ రాంచందర్ నాయక్, జెడ్పీ వైస్ చైర్మన్ ఇరిగి పెద్దులు, మాజీ ఆప్కాబ్ చైర్మన్ యడవల్లి విజయేందర్రెడ్డితో కలసి ఎన్నికల ప్ర చారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ప్రజలు బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారానికి భారీగా తరలివచ్చారు. మహిళలు బోనాలతో వచ్చి, వి జయ తిలకం దిద్ది, మంగళహారతులతో నోముల భగత్కు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భగత్కుమార్ మాట్లాడుతూ జానారెడ్డి కుటుంబానికి ఎన్నికల వేళనే నియోజకవర్గ ప్రజ లు గుర్తుకొస్తారని ఎద్దేవా చేశారు. మీలో ఒకడిగా ఉన్న నన్ను గెలిపిస్తే నియోజకవర్గ అభివృద్ధికి మరింత కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
నియోజకవర్గం వెనుకబాటుకు జానారెడ్డి కారణమని తెలిపారు. రెండున్నరేండ్లలోనే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసినట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు గెలుపు కోసం బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను ప్రలోభాలకు గురి చేయడం హేయమైన చర్య అని అన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా బీఆర్ఎస్దే గెలుపు అని ధీమా వ్యక్తం చేశారు. కారు గుర్తుకు ఓటేసి తనను అధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన దేశానికే ఆదర్శమని ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి, ట్రైకార్ చైర్మన్ ఇస్లావత్ రాంచందర్నాయక్ అన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలోనే రాష్ట్రం, నాగార్జున సాగర్ నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని వి ధంగా మన రాష్ట్రంలో వివిధ సంక్షేమ, అభివృద్ది కార్యక్రమాలు అమలు అవుతున్నాయని పేర్కొన్నారు. రైతులకు 24గంటల కరెంట్, రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలు కొనసాగుతున్నాయని తెలిపారు. అన్ని వర్గాల సంక్షేమమే బీఆర్ఎస్ ల క్ష్యమని అన్నారు.
ఈ కార్యక్రమంలో అనుముల ఎంపీపీ సుమతిపురుషోత్తం, మార్కెట్ కమిటీ చైర్మన్ జవ్వాజి వెంకటేశం, బీఆర్ఎస్ పార్టీ మండలఅధ్యక్షుడు కురాకుల వెంకటేశ్వర్లు, ఎన్నమల్ల సత్యం, పోశం శ్రీనివాస్గౌగౌడ్,మాజీ ఎంపీపీ అనుముల ఏడుకొండల్, ఎంపీటీసీ ఉర్లగొండ వెంకటయ్య, రాయనబోయిన రామలింగయ్య, చేగొండి కృష్ణ, చాపల వెంకన్న, బోమ్మిశెట్టి వెంకటేశ్వర్లు, షేక్ అజ్గర్, కుంటిగొర్ల పాపాయ్య, లక్ష్మణ్నాయక్, గోపాల్రెడ్డి, ఆవుల సైదులు, ఉడ్తూరి శ్రీనివాసరెడ్డి, పంగ లక్ష్మణ్, ప్రతాఫ్రెడ్డి,ఆయా గ్రామాల సర్పంచ్లు బోప్పని విజయ్, గుండెబోయిన వెంకన్న, రాములు, వెంకట్రెడ్డి, బీఆర్ఎస్ నాయకులలు తదితరులున్నారు.