మోత్కూరు, నవంబర్ 18 : ఐదేండ్లకోసారి ఎన్నికలప్పుడు మాత్రమే వస్తూ ప్రజల బాగోగులు పట్టని కాంగ్రెస్, బీజేపీలు మనకొద్దని.. ప్రజలను కడుపులో పెట్టుకుని కాపాడుకునే ముఖ్యమంత్రి కేసీఆరే కావాలని బీఆర్ఎస్ తుంగతుర్తి అభ్యర్థి, ఎమ్మెల్యే గాదరి కిశోర్ అన్నారు. శనివారం మండలంలోని అనాజిపురం, బుజిలాపురం, కొండగడప, పాటిమట్ల, పొడిచేడు, పాలడుగు, దత్తప్పగూడెంలో ఎమ్మెల్యే ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బుజిలాపురంలోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయా గ్రామాల్లో మహిళలు కిశోర్కుమార్కు మంగళ హారతులు ఇచ్చి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ సహకారంతో తుంగతుర్తి నియోజక వర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసినట్లు, మరింత అభివృద్ధి కోసం నవంబర్ 30న జరిగే ఎన్నికల్లో బీఆర్ఎస్ కారు గుర్తుకు ఓటు వేసి తనను మరోమారు ఆశీర్వదించాలని ప్రజలను కోరారు.
గత పాలకులు నియోజక వర్గ అభివృద్ధిని విస్మరించారన్నారు. తాను ఎమ్మెల్యే ఆయ్యాక నియోజక వర్గాన్ని ఎవరూ ఊహించని విధంగా అభివృద్ధి చేసినట్లు చెప్పారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో మరోసారి తుంగతుర్తిలో గులాబీ జెండా ఎగురడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఒకప్పుడు కరువు కాటకాలు, కక్షలతో ఉన్న ఈ ప్రాంతానికి ఎస్సారెస్పీ కాల్వ ద్వారా కాళేశ్వరం జలాలు తీసుకొచ్చి ఆరు మండలాల్లోని లక్ష ఎకరాలను సాగులోకి తెచ్చి కరువును పారదోలిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని వివరించారు. బునాదిగాని కాల్వ అసంపూర్తి పనులను పూర్తి చేసి బస్వాపురం ప్రాజెక్ట్కు అనుసంధానం చేసి మోత్కూరు, అడ్డగూడూరుకు కాళేశ్వరం జలాలను తీసుకురావడానికి కృషి చేస్తానని చెప్పారు. కాంగ్రెస్కు అధికారం ఇస్తే వ్యవసాయానికి 24 గంటల కరెంట్ ఇవ్వరన్నారు. రైతు బంధును సైతం బంద్ చేస్తారని తెలిపారు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ సేవకుడిగా పని చేస్తున్న తనను ఆశీర్వదించి గెలిపిస్తే మరింత అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు.
సీఎం కేసీఆర్ సారథ్యంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రస్తుతం రైతులకు ఎకరానికి రూ.10వేలు ఇస్తుండగా ఎన్నికల అనంతరం దాన్ని రూ.16 వేలకు పెంచనున్నట్లు తెలిపారు. అలాగే కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్కు రూ.2 లక్షలు, రూ.400కే గ్యాస్ సిలిండర్, సౌభాగ్యలక్ష్మి కింద పేద మహిళలకు రూ.3 వేలు, దివ్యాంగులకు నెలకు రూ.6 వేలు, అన్నపూర్ణ కార్డుదారులకు సన్న బియ్యం, ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల బీమా కల్పించనున్నట్లు వెల్లడించారు. కేసీఆర్ హ్యాట్రిక్ సీఎం కావడం కోసం ప్రతి ఒక్కరూ కారు గుర్తుకు ఓటేసి తనకూ ఎమ్మెల్యే అవకాశం కల్పించాలని కోరారు. మండలంలోని పాటిమట్ల, పొడిచేడులో కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యే కిశోర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.
కార్యక్రమంలో ఆయిల్ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి, జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్రెడ్డి, నియోజక వర్గ రాజకీయ పరిశీలకుడు నేవూరి ధర్మేందర్రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ తీపిరెడ్డి సావిత్రీమేఘారెడ్డి, ఎంపీపీ రచ్చ కల్పనాలక్ష్మీనర్సింహారెడ్డి, జడ్పీటీసీ గోరుపల్లి శారదాసంతోశ్రెడ్డి, బీఆర్ఎస్ మండల, మున్సిపాలిటీ అధ్యక్షులు పొన్నెబోయిన రమేశ్, బొడ్డుపల్లి కళ్యాణ్ చక్రవర్తి, ఎఫ్ఎస్సీఎస్ చైర్మన్ కంచర్ల అశోక్రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకురాలు కాసోజు శంకరమ్మ, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్లు కొణతం యాకూబ్రెడ్డి, చిప్పలపల్లి మహేంద్రనాథ్, చింతల విజయభాస్కర్రెడ్డి, డాక్టర్ లక్ష్మీనర్సింహారెడ్డి, కొండ సోంమల్లు, ఆయా గ్రామాల పార్టీ శాఖల అధ్యక్షులు, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.