నల్లగొండ రూరల్, నవంబర్ 13: కాంగ్రెస్ ఓటమి భయం పట్టుకుందని అందుకే బీఆర్ఎస్ శ్రేణులపై ్ట దాడులకు తెగబడుతుందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కంచర్ల భూపాల్రెడ్డి అన్నారు. మండలంలోని జీకే అన్నారం, అన్నారెడ్డిగూడెం, వెలుగుపల్లి, రసూల్పురం, ముషంపల్లి, తోరగల్, ఎం.దుప్పలపల్లి, జీ చెన్నారం, కొత్తపల్లి, అనంతారం గ్రామాల్లో ఆదివారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెలే ్య భూపాల్రెడ్డి మాట్లాడుతూ 20 రోజులైతే హైదరాబాద్కు పారిపోయేటోనికి, వారి చెంచాలకు ఎవరూ భయపడొద్దని, అందరూ ధైర్యంగా ఉండాలని సూచించారు. 20 ఏండ్లుగా ఎమ్మెల్యేగా నల్లగొండను గోసపెట్టి, ఎవరికీ కనపడకుండా హైదరాబాద్లో దాక్కున్న వ్యక్తి ఇప్పుడు డబ్బు సంచుల మత్తులో దాడులు చేసేందుకు మాత్రమే వచ్చాడని ఆరోపించారు.
దాడులు చేయడం వారికి వెన్నెతో పెట్టిన విద్య అన్నారు. సీఎం కేసీఆర్ అందరి కడుపు నింపేలా పథకాలు తెస్తుంటే కాంగ్రెస్ మాత్రం కడుపు మీద కొట్టేందుకు దాడులు చేస్తుందన్నారు.. నల్లగొండ గడ్డపై గులాబీ జెండా ఎగురుతుందని, సీఎం కేసీఆర్ను మూడో సారి అధికారంలోకి రాకుండా ఎవరూ ఆపలేరన్నారు. ఆయా కార్యక్రమాల్లో మార్కెట్ కమిటీ చైర్మన్ చీరపంకజ్ యాదవ్, పీఏసీఎస్ చైర్మన్ ఆలకుంట్ల నాగరత్నంరాజు , బీఆర్ఎస్ జిల్లా నాయకుడు డాక్టర్ చెరుకు సుధాకర్, సుహాన్, బకరం వెంకన్న, గాదె రాంరెడ్డి , పార్టీ మండలాధ్యక్షుడు దేప వెంకట్రెడ్డి, వైస్ ఎంపీపీ జిలే పల్లి పరమేశ్, మాజీ ఎంపీపీ నారబోయిన భిక్షం,మాజీ జడ్పీటీసీ తుమ్మల రాధాలింగస్వామి, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు పనస శ్రీను, రోయ్య బద్రి, సర్పంచులు పందిరి సరితాజాన్రెడ్డి, బోధనపు సరస్వతీ వెంకట్రెడ్డి, ఆండాలు, నాగయ్య, పద్మావతి, వీరమణి, ఐతగోని విజయ్ , విమలమ్మ, విజయారెడ్డి, కేథారి, రవి, శంకర్ పాల్గొన్నారు.
ఏఐఎంఐఎం సంపూర్ణ మద్దతు
నల్లగొండ: ఎమ్మెల్సీ మీర్జా రహమతుల్లా బేగ్ ఆధ్వర్యంలో ఏఐఎంఐఎం నల్లగొండ అధ్యక్షుడు మహమ్మద్ రజియోద్దీన్, ఎంఐఎం నాయకులు రఫీద్దీన్ హజీ, గౌస్ మహమ్మద్ మల్లిక్ సిరాజుద్దీన్ షఫీ ముదిసర్, షరీఫ్ ఖాన్ సమీరుద్దీన్ లుక్మాన్ ప్రతినిధి బృందం నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డిని క్యాంప్ కార్యాలయంలో సోమవారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు సం పూర్ణ మద్దతు ప్రకటించారు. ఎమ్మెల్యే కంచర్ల మాట్లాడుతూ నల్లగొండ అభివృద్ధికి సహకరించాలని వారి ని కోరారు. తనకు మద్దతు తెలిపిన ఎమ్మె ల్సీ, ఎంఐఎం నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.
బీఆర్ఎస్లో చేరిక
నల్లగొండ సిటీ: కనగల్ మండలం జీ.యెడవల్లి గ్రామ పంచాయతీ పరిధిలో 50 మంది కాంగ్రెస్కు రాజీనామా ఆవుల నరేందర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి వారికి గులాబీ కండువా కప్పి బీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో పీ ఏసీఎస్ చైర్మన్ దోటి శ్రీనివాస్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు అయితగోని యాదయ్యగౌడ్, ఎంపీటీసీ జగత్, సర్పంచ్ మారయ్య, గ్రామశాఖ అధ్యక్షుడు భూపతి పాల్గొన్నారు.
నల్లగొండ : నల్లగొండ పట్టణంలోని 24వ వార్డుకు చెందిన కాంగ్రెస్ కార్యకర్త ఎస్కే అమీర్ నాయకత్వంలో సయ్యద్ మతీన్, నయబ్, రఫీ, ఇమ్రాన్, మీన్హాజ్లతో పాటు శుక్రవారం పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా వారికి ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి గులాబీ కండువా కప్పి బీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు బోనగిరి దేవేందర్, నూరొద్దిన్ ఉన్నారు