చిట్యాల, జనవరి 17 : ఖమ్మంలో బుధవారం నిర్వహించే బీఆర్ఎస్ బహిరంగ సభకు ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు స్వచ్ఛందంగా పెద్ద ఎత్తున తరలి రావాలని రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి పిలుపునిచ్చారు. చిట్యాలకు చెందిన బీఆర్ఎస్ నాయకుడు కూనూరు సంజయ్దాస్ ఆధ్వర్యంలో పూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్ను మంగళవారం సూర్యాపేటలోని క్యాంపు కార్యాలయంలో మంత్రి ఆవిష్కరించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు జోగు అశోక్, తాడూరి చంద్రం, ఆర్.గోపి, మెహర్బాబు, రామాచారి, లింగస్వామి పాల్గొన్నారు.
చందంపేట : ఖమ్మంలో బుధవారం నిర్వహించనున్న బీఆర్ఎస్ బహిరంగ సభకు అధిక సంఖ్యలో తరలిరావాలని బీఆర్ఎస్ చందంపేట, నేరేడుగొమ్ము మండలాల అధ్యక్షులు ముత్యాల సర్వయ్య, లోకసాని తిరుపతయ్య కోరారు. మగళవారం ప్రజాప్రతినిధులు, పార్టీ ముఖ్య నాయకులతో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ పిలుపు మేరకు పెద్ద ఎత్తున తరలివెళ్లేందుకు పార్టీ శ్రేణులు సమాయత్తం అవుతున్నారని పేర్కొన్నారు. సమావేశంలో నాయకులు రాజవర్ధన్రెడ్డి, మున్నయ్య, బాలూనాయక్, నాగు, బషీర్, బావోజీ పాల్గొన్నారు.
కట్టంగూర్ : నేడు ఖమ్మంలో నిర్వహించే బీఆర్ఎస్ బహిరంగ సభను విజయవంతం చేయాలని జడ్పీటీసీ తరాల బలరాములు బుధవారం ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు స్వచ్ఛందంగా రావాలని కోరారు.
శాలిగౌరారం : ఖమ్మంలో నిర్వహించే బీఆర్ఎస్ ఆవిర్భావ సభకు అధిక సంఖ్యలో తరలిరావాలని పార్టీ మండలాధ్యక్షుడు ఐతగోని వెంకన్నగౌడ్ పిలుపునిచ్చారు. మంగళవారం మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు స్వచ్ఛందంగా తరలిరావాలని కోరారు. సమావేశంలో నాయకులు గుజిలాల్ శేఖర్బాబు, చామల మహేందర్రెడ్డి, పార్టీ అధ్యక్షుడు చిర్రబోయిన శ్రీనివాస్, బట్ట వీరబాబు, గౌర వీరయ్య, దాసరి వెంకన్న, నాగరాజుగౌడ్, ఓగోటి శ్రీనివాస్, వేల్పుల నరేందర్, పాక యాదయ్య, శేషరాజుపెల్లి వెంకన్న, పుల్లయ్య, రాపాక రాజు, కమలాకర్, ఐలపాక నారాజు, వీరసోములు పాల్గొన్నారు.
చిట్యాల. జనవరి 17 : ఖమ్మంలో బుధవారం నిర్వహించే బీఆర్ఎస్ సభతో దేశ రాజకీయాల్లో పెనుమార్పులు వస్తాయని మున్సిపల్ చైర్మన్ కోమటిరెడ్డి చిన వెంకట్రెడ్డి అన్నారు. మంగళవారం చిట్యాలలో జరిగిన పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. బీఆర్ఎస్ తొలి సభకు నాయకులు, ప్రజాప్రతినిధులు అధిక సంఖ్యలో తరలిరావాలని కోరారు. సమావేశంలో బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు పొన్నం లక్ష్మయ్య, కౌన్సిలర్లు కోనేటి కృష్ణ, బెల్లి సత్తయ్య, ఆర్యవైశ్య సంఘం జిల్లా అధ్యక్షుడు వనమా వెంకటేశ్వర్లు, కనకదుర్గ ఆలయ కమిటీ చైర్మన్ శీలా సత్యనారాయణ, గ్రంథాలయ కమిటీ చైర్మన్ దాసరి నర్సింహ్మ, నాయకులు గుండెబోయిన సైదులు, సిలువేరు శేఖర్, జిట్ట బొందయ్య, రుర్రవరం యాదయ్య, చిత్రగంటి ప్రవీణ్, జయారపు శివ పాల్గొన్నారు.