మాడ్గులపల్లి, మే 4 : పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఓటు వేసి ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు నిమ్మల నవీన్రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం మండలంలోని సీత్యాతండా, తోపుచర్ల గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించి మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి మోసం చేశారని అన్నారు. రైతులకు 24 గంటల కరెంటు ఇస్తామని చెప్పిన హామీ ఏమైందన్నారు.
5 ఎకరాల్లోపు రైతులందరికీ రైతుబంధు నగదును వారి ఖాతాల్లో జమ చేస్తామని చెప్పి సగం మందికే వేసినట్లు తెలిపారు. కాంగ్రెస్ పాలనలో ఏ ఒక్క వర్గం సంతోషంగా లేరని విమర్శించారు. ఎన్నికల ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయకుండా ప్రజలను నానా ఇబ్బందులకు గురిచేస్తున్న సీఎం రేవంత్రెడ్డికి పోస్టుకార్డుల ద్వారా నిరసన వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 13న జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో నల్లగొండ ఎంపీ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.