– ముఖ్యఅతిథిగా హాజరు కానున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
కోదాడ, జూన్ 13 : కోదాడ ఏ ఆర్ ఆర్ ఫంక్షన్ హాల్ లో ఈ నెల 14న బీఆర్ఎస్ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నట్లు ఆ పార్టీ పట్టణ అధ్యక్షుడు ఎస్కే నయీమ్ తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. పార్టీని నియోజకవర్గంలో మరింత బలోపేతం చేసేందుకు ప్రణాళికలు రూపొందించడంతో పాటు సభ్యత్వ నమోదుపై చర్చించనున్నట్లు వెల్లడించారు. మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ నేతృత్వంలో జరగనున్న ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఉమ్మడి నల్లగొండ జిల్లా సభ్యత్వ నమోదు ఇన్చార్జి ప్రవీణ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నట్లు పేర్కొన్నారు.. నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న పార్టీ, అనుబంధ సంఘాల శ్రేణులు, అభిమానులు భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని ఆయన కోరారు.