పెద్దఅడిశర్లపల్లి, జనవరి 12 : తెలంగాణ రాష్ర్టాన్ని సాధించి అభివృద్ధి పథంలో నడిపించిన బీఆర్ఎస్ రాబోయే రోజుల్లో దేశ రాజకీయాల్లో బలమైన శక్తిగా ఎదుగుతుందని ఎమ్మెల్యే రవీంద్రకుమార్ అన్నారు. గురువారం ఆయన సమక్షంలో మండలంలోని అంగడిపేట, పోతిరెడ్డిపల్లి వడ్డెరకాలనీకి చెందిన 30కుటుంబాలకు చెందిన 100మంది యువకులు కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందని హామీనిచ్చారు. పార్టీలో చేరిన వారందరూ సభ్యత్వం తీసుకోవడంతో ప్రమాద బీమా వర్తిస్తుందన్నారు. రాష్ట్రంలో అత్యధిక సభ్యత్వాలు కలిగిన పార్టీ బీఆర్ఎస్ అని పేర్కొన్నారు.
రైతుల సంక్షేమానికి అమలు చేస్తున్న రైతు బంధు, బీమా పథకాలు దేశానికే ఆదర్శమన్నారు. పార్టీలో చేరిన వారిలో ఇరగదిండ్ల రాములు, రవికుమార్, రమేశ్, రాజు, ఓర్సు యాదయ్య, నర్సింహ ఉన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ వంగాల ప్రతాప్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ వల్లపురెడ్డి , నాయకులు అంజిరెడ్డి, నిమ్మల అంతిరెడ్డి, తోటకూరి పరమేశ్, శేఖర్రెడ్డి, కర్ణయ్య, అర్వపల్లి నర్సింహ, యర్ర యాదగిరి, బషీర్ పాల్గొన్నారు.