నేరేడుగొమ్ము(చందంపేట), నవంబర్ 2 : అభివృద్ధిని చూసి మరోసారి తనను ఆశీర్వదించాలని బీఆర్ఎస్ దేవరకొండ అభ్యర్థి, ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ కోరారు. గురువారం నేరేడుగొమ్ము మండలంలోని కాచరాజుపల్లి, బుగ్గతండా, వైజాగ్కాలనీ, చిన్నమునిగల్, బచ్చాపురం, పెద్దమునిగల్, మోసంగడ్డతండా, కొత్తపల్లి, పేర్వాల, గుర్రపుతండా, పందిరిగుండుతండా, నేరేడుగొమ్ము గ్రామాల్లో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు గుత్తా అమిత్రెడ్డి, బిల్యానాయక్, రమేశ్నాయక్తో కలిసి విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అంబా భవానీ లిఫ్టుతో నేరేడుగొమ్ము మండలం సస్యశ్యామలం అవుతుందని, చిన్నమునిగల్ గ్రామ సమీపంలో కొనసాగుతున్న లిఫ్ట్తో ఈ ప్రాంతంలో 3,200 ఎకరాలకు సాగునీరు అందనుందని పేర్కొన్నారు.
సీఎం కేసీఆర్ మారుమూల మండలాలకు ప్రత్యేక నిధులు కేటాయించి అభివృద్ధికి తోడ్పాటునందిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే వైజాగ్ కాలనీలో ఎకో టూరిజం మంజూరైందని, బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రాగానే పనులు మొదలు పెట్టనున్నట్లు చెప్పారు. ఎకో టూరిజం ఏర్పాటుతో వైజాగ్కాలనీవాసులకు ఉపాధి మెరుగుపడుతుందన్నారు. సీఎం కేసీఆర్తోనే తండాల అభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు. అభివృద్ధిని కొనసాగించాలంటే వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ను ఆశీర్వదించాలని కోరారు. సీఎం కేసిఆర్తోనే తెలంగాణ బంగారు తెలంగాణగా మారనున్నట్లు తెలిపారు. ఎన్నికల్లో గెలుపొందిన తర్వాత సీఎం కేసీఆర్ మ్యానిఫెస్టోను అమలు చేస్తారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం 24 గంటలు ఉచిత కరెంటు ఇస్తుంటే, కాంగ్రెసోళ్ల 3 గంటలే కరెంటు సరిపోతదని పేర్కొనడం వారి అవగాహన రాహిత్యానికి అద్దం పడుతుందన్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాష్ట్రం అంధకారంలోకి వెళ్లడం ఖాయమని ఎమ్మెల్యే అన్నారు. బీఆర్ఎస్ను గెలిపిస్తే రైతుబంధును రూ.16 వేలకు పెంచడంతోపాటు పింఛన్ రూ.5వేలకు, సిలిండర్ను రూ.400లకే అందించనున్నట్లు తెలిపారు. ఇప్పటికే అమలు చేస్తున్న రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, దళితబంధు, కేసీఆర్ కిట్ దేశానికే ఆదర్శంగా నిలిచినట్లు గుర్తుచేశారు. ఇప్పటికే నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశానని, మరోసారి ఆశీర్వదిస్తే మరింత అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు గుత్తా అమిత్రెడ్డి మాట్లాడుతూ.. ప్రజలు బీఆర్ఎస్ పక్షాన ఉన్నారని, కాంగ్రెస్ ఓటమి ఖాయమని పేర్కొన్నారు.
బీఆర్ఎస్ ప్రచారానికి ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తుందన్నారు. ప్రచారానికి వచ్చిన ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నాయకులకు ఆయా గ్రామాల ప్రజలు ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కేతావత్ బిల్యానాయక్, వడ్త్య రమేశ్నాయక్, ఎంపీపీ పద్మాహన్మానాయక్, జడ్పీటీసీ బాలూనాయక్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు లోకసాని తిరుపతయ్య, పీఏసీఎస్ చైర్మన్ బాలయ్య, వైస్ ఎంపీపీ ఆరెకంటి ముత్యాలమ్మారాములు, బైరెడ్డి కొండల్రెడ్డి, కేతావత్ రవీందర్నాయక్, సర్పంచ్లు పల్స వెంకటయ్య, నాగునాయక్, బాలూనాయక్, బావోజీ, ఆంజనేయులు, కేతావత్ హరిలాల్, వడ్త్య చైతన్య, సోమ్లానాయక్, డాక్యానాయక్, సాయన్న, దేవుడు, బషీర్, చిన్నానాయక్, రాజు పాల్గొన్నారు.
మాల్ : రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చేస్తున్న అభివృద్ధిని చూసే వివిధ పార్టీల వారు బీఆర్ఎస్లో చేరుతున్నారని దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. గురువారం చింతపల్లి గ్రామానికి చెందిన పందుల సత్యం గౌడ్, గంజి మహేందర్, మస్న సందీప్తోపాటు పలువురు వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరారు. వారికి ఎమ్మెల్యే గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేవరకొండ ఖిలాపై గులాబీ జెండా ఎగురడం ఖాయమన్నారు. ఇతర పార్టీల వారు చేస్తున్న అబద్ధపు ప్రచారాలను తిప్పి కొట్టాలని పిలుపు నిచ్చారు. బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు దొంతం చంద్రశేఖర్రెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో పార్టీ మండల మాజీ అధ్యక్షుడు నట్వగిరిధర్, నాయకులు పాల్గొన్నారు.