ఆలేరు, నవంబర్ 4 : ఆలేరు పట్టణంలో బీఆర్ఎస్ అభ్యర్థి గొంగిడి సునీతమహేందర్రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. శనివారం ఆలేరు పట్టణంలో మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్యగౌడ్, నాయకుడు కల్లూరు రామచంద్రారెడ్డితోపాటు కుటుంబ సభ్యులు ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలిసి కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మాట్లాడుతూ.. మోసగాళ్లకు ఓటుతోబుద్ధి చెప్పాలని, ఆలేరు పట్టణాన్ని ఎంతో అభివృద్ధి చేసిన బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని కోరారు. గతంలో పట్టణం ఎలా ఉందో, ఇప్పుడు ఎలా ఉందో ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాలని సూచించారు. ఆలేరు పట్టణంలో డయాలసిస్ సెంటర్, ఇంటిగ్రేటెడ్ మారెట్, బటర్ఫ్లై లైట్స్, అండర్ పాస్ బ్రిడ్జి తదితర ఎన్నో పనులు చేశామని, కారు గుర్తుకు ఓటు వేసి మరోసారి ఆశీర్వదిస్తే పట్టణాన్ని మరింత అభివృద్ధి చేసుకుందామని చెప్పారు.
మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్యగౌడ్ మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నాయకుల మాయమాటలు నమ్మి మోసపోవద్దని సూచించారు. కాంగ్రెస్ పాలనలో చాలీచాలని కరెంటు, ఎరువులతో రైతులు అనేక ఇబ్బందులు పడ్డారని పేర్కొన్నారు. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ రైతులకు 24 గంటల ఉచిత కరెంటు, రైతుబంధు, రైతుబీమా లాంటి ఎన్నో పథకాలతో రైతులను ఆనందపరుస్తున్న గొప్ప నాయకుడు సీఎం కేసీఆర్ అని కొనియాడారు. ముచ్చటగా మూడోసారి కారు గుర్తుకు ఓటు వేసి గొంగిడి సునీతామహేందర్రెడ్డిని గెలిపించి కేసీఆర్ సారుకు కానుక ఇవ్వాలని కోరారు. మున్సిపల్ చైర్మన్ వస్పరి శంకరయ్య, వైస్ చైర్పర్సన్ మొరిగాడి మాధవీవెంకటేశ్, కౌన్సిలర్లు బెతి రాములు, రాయపురం నర్సింహులు, జూకంటి శ్రీకాంత్, కందుల శ్రీకాంత్, దాసి నాగలక్ష్మీసంతోష్, మూర్తల సునీతారమణారెడ్డి, మారెట్ కమిటీ వైస్ చైర్మన్ పోరెడ్డి శ్రీనివాస్, బీఆర్ఎస్ ఆలేరు పట్టణాధ్యక్షుడు పుట్ట మల్లేశ్గౌడ్, నాయకులు బాలస్వామి, ఫిలిప్స్, కృష్ణ, రామకృష్ణ, వెంకటేశ్, శ్రవణ్, ఉప్పలయ్య పాల్గొన్నారు.
యాదగిరిగుట్ట : యాదగిరిగుట్ట మండలం మహబూబ్పేటలో ఎన్నికల ప్రచారంలో భాగంగా యూత్ కాంగ్రెస్ మండల నాయకుడు వడ్లకొండ భరత్గౌడ్ ఆధ్వర్యంలో గాజుల శ్రీకాంత్, మచ్చ బలరాం, గాజుల గణేశ్తోపాటు 50 మంది కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్లో చేరారు. వారికి ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి గులాబీ కండువా కప్పి బీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కర్రె వెంకటయ్య, జడ్పీటీసీ తోటకూరి అనూరాధ, సర్పంచ్ ఆరె స్వరూప, గౌడ సంఘం అధ్యక్షుడు గాజుల శ్రీనివాస్గౌడ్ పాల్గొన్నారు.
రాజాపేట : గొంగిడి సునీతామహేందర్రెడ్డి గెలుపు కోరుతూ శనివారం మండల కేంద్రంలో బీఆర్ఎస్ శ్రేణులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు బెడిదె వీరేశం, మండల సెక్రటరీ జనరల్ సందిల భాస్కర్గౌడ్, రజక సంఘం మండలాధ్యక్షుడు సట్టు తిరుమలేశ్, మహేంద్ర యువసేన మండలాధ్యక్షుడు బిల్లకుదురు రాజు, మండల ప్రధాన కార్యదర్శి రేగు సిద్ధులు, గజ్జెల రాజు, ఎర్రగోకుల రాజు, చంద్రయ్య, మహేశ్ పాల్గొన్నారు.
ఆలేరు, ఆత్మకూరు(ఎం) మండలాల్లో..
ఆలేరు రూరల్/ఆత్మకూరు(ఎం) : ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డిని గెలిపించాలని కోరుతూ.. శనివారం ఆలేరు, ఆత్మకూరు(ఎం) మండలాల్ల బీఆర్ఎస్ నాయకులు ప్రచారం నిర్వహించారు. సర్పంచ్లు, నాయకులు పాల్గొన్నారు.
తుర్కపల్లి : మండల కేంద్రంతోపాటు మాదాపురం గ్రామంలో బీఆర్ఎస్ నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కారు గుర్తుకు ఓటు వేసి గొంగిడి సునీతామహేందర్రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ గట్టు తేజస్వీనిఖిల్, అధికార ప్రతినిధి తలారి శ్రీనివాస్ పాల్గొన్నారు.
బొమ్మలరామారం మండలంలో..
బొమ్మలరామారం : మండల కేంద్రంలోని బీసీ కాలనీలో బీఆర్ఎస్ నాయకులుఉ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఉప సర్పంచ్ జూపల్లి భరత్, నాయకులు సత్యనారాయణ, బాలనర్సింహ, శ్రీకాంత్, మహేశ్ గౌడ్, నాగరాజు, రవి, శాంతాచారి, రవి, కృష్ణ పాల్గొన్నారు.
మోటకొండూర్ : బీఆర్ఎస్ అభ్యర్థి గొంగిడి సునీత గెలుపు కోసం బీఆర్ఎస్ మండల నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ మ్యానిఫెస్టోను ప్రజలకు వివరించారు. కార్యక్రమంలో మండల కో ఆప్షన్ సభ్యుడు బురాన్, మండల బీసీ సెల్ అధ్యక్షుడు మల్గ గౌరయ్య, నియోజకవర్గ యువజన విభాగం ప్రధాన కార్యదర్శి జివిలికపల్లి వెంకటేశ్, సోషల్ మీడియా కన్వీనర్ గంధమల్ల మధు, విద్యార్థి విభాగం అధ్యక్షుడు బొట్ల ప్రశాంత్, నాయకులు నర్సింహులుయాదవ్ పవన్, బుచ్చిరెడ్డి, భిక్షపతి, బాలకృష్ణ, దడిగె మధు, జహంగీర్, కృష్ణ, నరేశ్ పాల్గొన్నారు.