మిర్యాలగూడ, నవంబర్ 11: సీఎం కేసీఆర్ నాయకత్వంలో పేదల అభ్యున్నతి కోసం నిరంతరం కృషి చేస్తున్నానని, అభివృద్ధి, సంక్షేమాన్ని కొనసాగించేందుకు మరో మారు తనకు అవకాశం కల్పించాలని మిర్యాలగూడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నల్లమోతు భాస్కర్రావు కోరారు. శనివారం పట్టణంలోని సుందర్నగర్, రంగ్రీజ్బజార్, మెయిన్బజార్, రంగన్నకాలనీ, ముత్తిరెడ్డికుంట, వినోభానగర్, అశోక్నగర్, రెడ్డికాలనీ, బాపూజీనగర్, వడ్డెరగూడెం, గాయత్రీనగర్, హనుమాన్పేట ప్రాంతాల్లో ప్రగతి యాత్ర నిర్వహించారు. ఆయా ప్రాంతాల్లోని మహిళలు, యువకులు పెద్ద ఎత్తున తరలివచ్చి డప్పు వాయిద్యాలు, కోలాటాలు, కళాకారుల విన్యాసాలతో ఎమ్మెల్యే భాస్కర్రావుకు ఘనంగా స్వాగతం పలికారు.
ఎమ్మెల్యే బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఇంటింటికి వెళ్లి మిర్యాలగూడ పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమాన్ని వివరించి ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదలను ఆదుకోవడంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందన్నారు. పార్టీ మ్యానిఫెస్టోను వందశాతం అమలు చేస్తామన్నారు. మున్సిపాలిటీలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, వీధి దీపాలు, ప్రధాన రహదారులు, జంక్షన్ల అభివృద్ధి చేశామని, దాంతో పాటు అన్ని వర్గాల వారికోసం భవనాలు, ప్రజల సౌకర్యార్థం అనేక నిర్మాణాలు చేపట్టినట్లు చెప్పారు. పట్టణంలోని 7,18, 19, 20, 21,22, 28, 36,37 వార్డుల్లో కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు.
అన్ని సామాజిక వర్గాల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు. రాబోయే రోజుల్లో సంక్షేమం, అభివృద్ధిని మరింతగా విస్తరించేందుకు కారు గుర్తుకు ఓటు వేసి తనను మూడో సారి ఆశీర్వదించాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్, వైస్ చైర్మన్ కుర్ర విష్ణు, బీఆర్ఎస్ యువ నాయకుడు నల్లమోతు సిద్ధార్థ, పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి పెద్ది శ్రీనివాస్గౌడ్, కౌన్సిలర్లు వంగాల నిరంజన్, పత్తిపాటి సంజాతానవాబ్, ఇలియాస్, ఎండీ. సాదేఖాబేగంఖాదర్, బల్లెం దేవకమ్మాఅయోధ్య, నాయకులు వేముల దుర్గారావు, కందగట్ల అశోక్, కుప్పాల సుబ్బారావు, కోటేశ్వర్రావు, సందేశి అంజన్రాజు, పిన్నబోయిన శ్రీనివాస్, పండుగ క్రాంతి పాల్గొన్నారు.