స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా బుధవారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా రక్తదాన శిబిరాలు నిర్వహించారు. ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు, యువతీయువకులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి స్ఫూర్తిని చాటారు. ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్రెడ్డి, రమావత్ రవీంద్రకుమార్, బొల్లం మల్లయ్య యాదవ్ ఆయా నియోజకవర్గ కేంద్రాల్లో రక్తదాన శిబిరాలను ప్రారంభించారు. సూర్యాపేటలో కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్, ఎస్పీ రాజేంద్రప్రసాద్, మున్సిపల్ చైర్పర్సన్ అన్నపూర్ణ పాల్గొన్నారు. మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రిలో ఎన్బీఆర్ ఫౌండేషన్ చైర్మన్ నల్లమోతు సిద్ధార్థ, హుజూర్నగర్లో ఆర్డీఓ వెంకారెడ్డి రక్తదానం చేశారు.
ఎమ్మెల్యే రవీంద్రకుమార్
జిల్లా వ్యాప్తంగా రక్తదాన శిబిరాలు
దేవరకొండ, ఆగస్టు 17 : ప్రతి ఒక్కరూ రక్తదానం చేయడం వల్ల ఆపదలో ఉన్న అనేక మంది ప్రాణాలు కాపాడ వచ్చని ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా బుధవారం ప్రభుత్వ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా రవీంద్రకుమార్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ బాధ్యతగా ప్రతి మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేయాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఆలంపల్లి నర్సింహ, ఎంపీపీ నల్లగాసు జాన్యాదవ్, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు హన్మంత్ వెంకటేశ్గౌడ్, వైస్ చైర్మన్ రహత్ అలీ, మున్సిపల్ మాజీ చైర్మన్ వడ్త్య దేవేందర్నాయక్, స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్వీటీ, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు నేనావత్ శ్రీనునాయక్, నాయకులు బొడ్డుపల్లి కృష్ణ, పొన్నబోయిన సైదులు, మూడావత్ జయప్రకాశ్నారాయణ, మహ్మద్ రైస్, డిప్యూటీ డీఎంహెచ్ఓ కృష్ణకుమారి, ఆస్పత్రి సూపరింటెండెంట్ రాములునాయక్ పాల్గొన్నారు.
మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రిలో..
స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా బుధవారం పట్టణంలోని ఏరియా ఆస్పత్రిలో నిర్వహించిన రక్తదానం శిబిరాన్ని మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహారెడ్డి ఎన్బీఆర్ ఫౌండేషన్ చైర్మన్ నల్లమోతు సిద్ధార్థతో కలిసి ప్రారంభించారు. నల్లమోతు సిద్ధార్థతో పాటు పలువురు టీఆర్ఎస్ నాయకులు, యువకులు రక్తదానం చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ నూకల సరళాహన్మంతరెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ కుర్ర విష్ణు, ఏఎంసీ మాజీ చైర్మన్లు శ్రీనివాస్రెడ్డి, చిట్టిబాబునాయక్, ఎంపీడీఓ జ్యోతిలక్ష్మి, ఆస్పత్రి సూపరింటెండెంట్ శ్రీనివాస్సమరద్, పెద్ది శ్రీనివాస్, జావిద్, రమేశ్, శ్రీనివాస్రెడ్డి, వింజం శ్రీధర్, గిరి, చీదళ్ల శ్రీను, ఎండీ.షోయబ్, ఇమ్రాన్ పాల్గొన్నారు.
కమలా నెహ్రూ దవాఖానలో
నందికొండ : నాగార్జునసాగర్ హిల్కాలనీలోని కమలా నెహ్రూ ఏరియా దవాఖానలో ఆస్పత్రి సీఎంఓ భానుప్రసాద్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. 30 మంది రక్తదానం చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రవీందర్రెడ్డి, వైస్ చైర్మన్ మంద రఘువీర్, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కర్ణ బ్రహ్మానందరెడ్డి, కౌన్సిలర్లు ఇర్ల రామకృష్ణ, రమేశ్జి, నాయకులు మోహన్నాయక్, విక్రమ్ పాల్గొన్నారు.
వజ్రోత్సవ వేడుకల్లో భాగస్వాములు కావాలి
ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి
నీలగిరి, ఆగస్టు 17 : దేశానికి స్వాతంత్య్రం కోసం తమ ప్రాణాలను ఫణంగా పెట్టి పోరాడిన సమరయోధుల త్యాగాలను భావితరాలకు తెలిపేందుకే రాష్ట్ర ప్రభుత్వం స్వంతంత్ర భారత వజ్రోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నదని నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి అన్నారు. వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా బుధవారం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా 90 మంది రక్తదానం చేశారు. కార్యక్రమంలో డీఎంహెచ్ఓ డాక్టర్ అన్నిమల్ల కొండల్రావు, ఆర్డీఓ జగన్నాధరావు, ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ లచ్చునాయక్, జిల్లా అంధత్వ నివారణ అధికారి డా.ఏసీహెచ్ పుల్లారావు, టీఆర్ఎస్ మున్సిపల్ ఫ్లోర్లీడర్ అభిమన్యు శ్రీనివాస్, జడ్పీ కోఆప్షన్ సభ్యుడు తీగల జాన్శాస్త్రీ పాల్గొన్నారు.
డీసీహెచ్ ఆధ్వర్యంలో..
జిల్లా ఆస్పత్రుల సమన్వయ అధికారి కార్యాలయం పరిధిలోని నాలుగు ఆస్పత్రుల్లో రక్తదాన శిబిరాలు నిర్వహించి 209 యూనిట్ల రక్తాన్ని సేకరించినట్లు సమన్వయ అధికారి డాక్టర్ మాతృ తెలిపారు.
12వ బెటాలియన్లో ..
నీలగిరి : అన్నెపర్తిలోని 12 బెటాలియన్లో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని బెటాలియన్ కమాండెంట్ ఎన్వీ. సాంబయ్య ప్రారంభించారు. 30 మంది పోలీసులు రెడ్క్రాస్ సంస్థకు రక్తదానం చేశారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్లు ఎం.వీరయ్య, వెంకన్న, యూనిట్ మెడికల్ ఆఫీసర్ ఎం.నాగలక్ష్మీ, బెటాలియన్, రెడ్క్రాస్ సిబ్బంది పాల్గొన్నారు.
జిల్లా జైలులో ..
జిల్లా జైలులో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని జిల్లా పరిశ్రమల అధికారి వి. కోటేశ్వర్రావు ప్రారంభించారు. సుమారు 50 మంది జైలు సిబ్బంది రక్తదానం చేశారు. కార్యక్రమంలో జైలు సూపరింటెండెంట్ దేవ్లా, జైలర్లు అనిల్ కుమార్, డిప్యూటీ జైలర్ నరేశ్, జైలు డాక్టరు ఫణీంద్ర, సిబ్బంది నిర్మల, అనిత, శ్రీరామ్, టి.రామలింగయ్య పాల్గొన్నారు.