నమస్తే తెలంగాణ ప్రత్యేక ప్రతినిధి, మునుగోడు (అక్టోబరు 26) : శిఖండి షిండేలాంటి వాళ్లను తయారు చేసి కేసీఆర్పైన కుట్రలు చేస్తున్న బీజేపీ ఆటలు తెలంగాణలో సాగవని, కేసీఆర్ వ్యక్తి కాదు.. ఓ శక్తి అని, ఇప్పటికైనా బీజేపీ నేతలు గ్రహించాలని ప్రభుత్వ చీఫ్ విప్, వరంగల్ (పశ్చిమ) ఎమ్మెల్యే దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. మునుగోడులోని టీఆర్ఎస్ ఎన్నికల కార్యాలంయలో బుధవారం రాత్రి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
మునుగోడు ఎన్నికలకు కారణమైన కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డిని కొన్నట్టుగానే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కూడా కొనుగోలు చేయాలని బీజేపీ కుట్రలు చేస్తున్నదని, ఆ కుట్రలు తెలంగాణలో సాగవని అన్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రజల నుంచి, ఉద్యమం నుంచి వచ్చారని, అమ్ముడుపోయేవాళ్లు కాదని, గుర్తించాలన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలను కుట్రలు, కుతంత్రాలు, ఈడీ, ఐటీతో కూలదోసే కుట్రలను ఇప్పటికైనా ఆపాలని హితవు పకారు. కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డికి 20 వేల కోట్ల రూపాయల కాంట్రాక్ట్ ఇచ్చి బీజేపీ వైపునకు తిప్పుకున్నారని విమర్శించారు. ఇప్పటికైనా కుట్రలు, కుతంత్రాలు ఆపకుంటే ప్రజల చేతిలో శిక్ష తప్పదని హెచ్చరించారు.