నకిరేకల్, జనవరి 3 : రాష్ట్రంలో సీఎం కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని, అందువల్లే ఇతర పార్టీల వారు బీఆర్ఎస్లో చేరుతున్నారని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. కేతేపల్లి మండలం బండపాలెం గ్రామానికి చెందిన వివిధ పార్టీల నాయకకులు మంగళవారం నకిరేకల్ పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వారికి ఎమ్మెల్యే గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
పార్టీలో చేరిన వారిలో మారం మీనారెడ్డి, దూదిపాల సాగర్రెడ్డి, వంగూరి యేసు, అరుణ్కుమార్, ప్రశాంత్, శ్రీకాంత్ ఉన్నారు. అనంతరం పట్టణానికి చెందిన పలువురు లబ్ధిదారులకు నూతన పెన్షన్ కార్డులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాచకొండ శ్రీనివాస్ గౌడ్, పట్టణాధ్యక్షుడు ఎల్లపురెడ్డి సైదిరెడ్డి, నాయకులు పెండెం సదానందం, దైద పరమేశ్, సామ శ్రీనివాస్రెడ్డి, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
తొండల్వాయి గ్రామంలో..
నార్కట్పల్లి మండలం తొండల్వాయి గ్రామానికి చెందిన వార్డు సభ్యులు చింత నర్సమ్మ, ఊషమ్మ, యాదగిరి ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ చింత సుధాకర్, చింత ప్రమీళ, వెంకన్న, ప్రవీణ్, మధు పాల్గొన్నారు.