ఆత్మకూర్.ఎస్, జనవరి 8 : మండలంలోని ఏపూరు గ్రామంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతిచెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏపూరు గ్రామానికి చెందిన సామ వెంకట్రెడ్డి కుమారుడు సామ సతీశ్(28) స్థానిక బంకులో పెట్రోల్ పోయించు కుని తిరిగి ఇంటికి బయల్దేరాడు.
ఈ క్రమంలో పెట్రోల్ బంక్ పక్కనే ఉన్న ఫర్జిలైజర్ షాపులో ఎరువులు వేసుకొని బొలెరో రోడ్డుపైకి రాగా గమనించకపోవడంతో బైక్ బొలెరో కిందకు దూసుకెళ్లింది. దాంతో సతీశ్ తలకు తీవ్ర గాయాలుకాగా చికిత్స నిమిత్తం సూర్యాపేటకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందాడు. కాగా వెంకట్రెడ్డి భార్య రెండేండ్ల క్రితం మృతి చెందింది.
కుమారుడు సతీశ్ అతడికి చేదోడు వాదోడుగా ఉండేవాడు. ఇరువురి మృతితో వెంకట్రెడ్డి ఒంటరి వాడయ్యాడు. కుటుంబ సభ్యులు, బంధువులు శోక సముద్రంలో మునిగిపోయారు. మృతుడి బావ సుధీర్రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ యాదవేంద్రరెడ్డి తెలిపారు.