నల్లగొండ : బైక్ అదుపుతప్పి రోడ్డు వెంట ఆగి ఉన్న లారీని ఢీకొనడంతో వ్యక్తి దుర్మరణం చెందాడు. నల్లగొండ జిల్లా చింతపల్లి మండల కేంద్రంలోని సాయిబాబా ఆలయం వద్ద నాగార్జునసాగర్ హైదరాబాద్ హైవే ఈ దుర్ఘటన జరిగింది. మృతుడిని చింతపల్లి మండలం నసర్లపల్లి గ్రామానికి చెందిన రామ్మోహన్గా పోలీసులు గుర్తించారు. మృతుడి భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు చింతపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. రోడ్డుపై నిర్లక్ష్యంగా లారీని ఆపిన డ్రైవర్పై కేసు నమోదు చేశారు.