అన్ని వర్గాల అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా పాలన సాగిస్తున్న సీఎం కేసీఆర్ దేశానికే ఆదర్శంగా నిలిచారని భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి అన్నారు. బుధవారం భూదాన్ పోచంపల్లి, బీబీనగర్ మండలాల్లో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాలు సంబురంగా జరిగాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పైళ్ల మాట్లాడుతూ స్వరాష్ట్రంలో పల్లెలు, పట్టణాల ప్రగతితో రూపురేఖలు మారిపోయాయని, అరవై ఏండ్లలో జరుగని అభివృద్ధి పదేండ్లలోనే సీఎం కేసీఆర్ చేసి చూపించారని కొనియాడారు. గడపగడపకూ వెళ్లి ప్రజలకు అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరించాలని, బీజేపీ, కాంగ్రెస్ కుట్రలను తిప్పికొట్టాలని బీఆర్ఎస్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్దే విజయమని, పార్టీ కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమాల్లో బీఆర్ఎస్ జిల్లా ఇన్చార్జి యాదవరెడ్డి, జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు.
భూదాన్ పోచంపల్లి/బీబీనగర్, మే 31 : సీఎం కేసీఆర్ పాలన దేశానికే ఆదర్శమని భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి అన్నారు. బుధవారం భూదాన్ పోచంపల్లి పట్టణ కేంద్రంలోని బాలాజీ ఫంక్షన్ హాల్లో పోచంపల్లి మున్సిపాలిటీ, మండలంలోని మెహర్ నగర్, జలాల్పూర్, భీమనపల్లి, అంతమ్మగూడెం, ధోతిగూడెం, జిబ్లక్పల్లి, దంతూరు, కనుముకుల, వంకమామిడి, ధర్మారెడ్డిపల్లి, శివారెడ్డిగూడెం గ్రామాల కార్యకర్తలతో అలాగే బీబీనగర్ మండలం నెమరగోములలోని వీఎల్ఎన్ఎస్ ఫంక్షన్హాల్లో గూడూరు, కొండమడుగు, జైనపల్లి, మహదేవ్పూర్, జమీలాపేట్, నెమరగోముల, రాయరావుపేట్, జియాపల్లి, జియాపల్లితండా, మీదితండా గ్రామాల కార్యకర్తల ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఆత్మీయ సమ్మేళనం జిల్లా ఇన్చార్జి ఎమ్మెల్సీ వంటేరు యాదవరెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డితో కలిసి ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీకి కార్యకర్తలే కథా నాయకులన్నారు. గ్రామాల సమస్యలన్నింటిని పరిష్కరిస్తానని తెలిపారు. అందుకే గ్రామ గ్రామాన పర్యటిస్తూ సమస్యలను అడిగి తెలుసుకుంటున్నట్లు చెప్పారు. రాబోవు ఎన్నికల్లో కార్యకర్తలందరూ సమిష్టిగా పని చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాకముందు వచ్చిన తర్వాత జరిగిన అభివృద్ధి, జీవన ప్రమాణాల్లో మార్పులను ప్రజలకు వివరించాలని సూచించారు. ప్రతిపక్షాల దుర్మార్గ ప్రచారాన్ని తిప్పికొట్టాలని ఉద్బోదించారు. 50 ఏళ్లలో జరుగని అభివృద్ధి పదేళ్లలో చేసి చూపించిన ఘనత కేసీఆర్కే దక్కిందని కొనియాడారు. పార్టీలకు అతీతంగా గడప గడపకు సంక్షేమ ఫలాలు అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్కే దకుతుందన్నారు.వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయంతో కేసీఆర్ మూడోసారి సీఎం కావడం ఖాయమన్నారు. కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామన్నారు. ప్రజలకు, పార్టీకి వారధిగా పని చేయాలని పేర్కొన్నారు.
భువనగిరి ఖిల్లాపై మూడోసారి గులాబీ జెండా ఎగురవేయాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పార్టీ కార్యకర్తలు ప్రజలకు, ప్రభుత్వానికి అనుసంధానకర్తలా పని చేయాలని చెప్పారు. ప్రజా సేవలో రాణించాలనుకునే వారు ప్రజల్లో ఉండాల్సిన అవసరం ఉందన్నారు. నిస్వార్ధంగా ప్రజలకు సేవ చేయాలనే తలంపుతో రాజకీయాల్లోకి వచ్చిన ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి భువనగిరి నియోజకవర్గ ప్రజలకు దక్కిన అదృష్టమని పేర్కొన్నారు.
తెలంగాణలో ప్రజలను ఓటు అడిగే హకు కేవలం బీఆర్ఎస్ పార్టీకే ఉన్నదని ఎమ్మెల్సీ, ఆత్మీయ సమ్మేళన జిల్లా ఇన్చార్జి వంటేరు యాదవరెడ్డి అన్నారు. అన్ని వర్గాలకు సంక్షేమ ఫలాలను అందించి, వెలుగులు నింపిన మహనీయుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని కొనియాడారు. అభివృద్ధిని చూసి ఓర్వలేని ప్రతిపక్షాల విష ప్రచారాన్ని తిప్పికొట్టాలని పేర్కొన్నారు. కార్యక్రమాల్లో ఎంపీపీలు మాడుగుల ప్రభాకర్రెడ్డి, సుధాకర్గౌడ్, మున్సిపల్ చైర్పర్సన్ చిట్టిపోలు విజయలక్ష్మీశ్రీనివాస్, జడ్పీటీసీలు కోట పుష్పలతామల్లారెడ్డి, గోలి ప్రణీతాపింగళ్రెడ్డి, వైస్ ఎంపీపీలు పాక వెంకటేశ్యాదవ్, వాకిటి గణేశ్రెడ్డి, వైస్ చైర్మన్ బాతుక లింగస్వామి, బీఆర్ఎస్ మండల, పట్టణ ప్రధాన కార్యదర్శులు పాటి సుధాకర్రెడ్డి, సీత వెంకటేశం, చిలువేరు బాలనర్సింహ, గునిగంటి మల్లేశంగౌడ్, పీఏసీఎస్ చైర్మన్లు కందాడి భూపాల్రెడ్డి, మెట్టు శ్రీనివాస్రెడ్డి, సర్పంచ్, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు సామ రవీందర్రెడ్డి, జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ స్థాయి సంఘం చైర్మన్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రాచమల్ల శ్రీనివాసులు, ప్రధాన కార్యదర్శి చింతల సుదర్శన్రెడ్డి, నాయకులు పగిళ్ల సుధాకర్రెడ్డి, బత్తుల శ్రీశైలంగౌడ్, ముత్యాల మైపాల్రెడ్డి, రావుల శేఖర్రెడ్డి, గోరంటి శ్రీనివాస్రెడ్డి, కందాడి సుధాకర్రెడ్డి, మెట్టు మోహన్రెడ్డి, బొర్ర రమేశ్, ఎరుకల పాండురంగంగౌడ్, ఆల్వ మోహన్రెడ్డి, గోరుకంటి బాలచందర్, కౌన్సిలర్లు, కొంగరి కృష్ణ, కర్నాటి రవీందర్, గుండు మధు, సామల మల్లారెడ్డి, పెద్దల చక్రపాణి, కుడికల అఖిల బలరాం, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, గ్రామ శాఖ అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
వలిగొండ : రాష్ట్రంలోని ప్రతి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి అన్నారు. మండలంలోని దాసిరెడ్డిగూడెంలో రూ.30 లక్షలు, నాతాళ్లగూడెంలో రూ.21 లక్షలతో కొత్తగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాలను ఆయన ప్రారంభించారు. అలాగే నాతాళ్లగూడెంలో సీసీ రోడ్లు, స్కూల్ కాంపౌండ్ వాల్ను ప్రారంభించి అండర్ డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ నూతి రమేశ్రాజ్, జడ్పీటీసీ వాకిటి పద్మాఅనంతరెడ్డి, సర్పంచులు కొమిరెల్లి సరితాసంజీవరెడ్డి, ఉలిపె మల్లేశం, ఎంపీటీసీలు నోముల మల్లేశం, మోటె నర్సింహ, నాయకులు పైళ్ల రాజవర్ధన్రెడ్డి, మొగుళ్ల శ్రీనివాస్, ముద్దసాని కిరణ్రెడ్డి, శ్రీధర్రెడ్డి, పల్సం రమేశ్, ఎమ్మె లింగస్వామి పాల్గొన్నారు.