చిట్యాల, జనవరి 22 : పట్టణంలో హరహర పుత్రుడు అయ్యప్ప స్వామి ఆలయ నిర్మాణ పూజ కార్యక్రమాన్ని ఆదివారం శాస్త్రోక్తంగా జరిపించారు. కార్యక్రమానికి శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మండలి చైర్మన్ సుఖేందర్రెడ్డి మాట్లాడుతూ ఆధ్యాత్మిక కార్యక్రమాలతో మానసిక ప్రశాంతత చేకూరుతుందన్నారు. మన సంస్కృతీ, సంప్రదాయాలకు నిలయాలైన ఆలయాల నిర్మాణాలతో ఆధ్యాత్మిక వెల్లివిరుస్తుందన్నారు. ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మాట్లాడుతూ ఆలయాలు హిందూ సంస్కృతీ, సంప్రదాయాలకు ప్రతిరూపాలన్నారు.
ఆలయ నిర్మాణాలకు తనవంతు సహకారం అందిస్తానని తెలిపారు. శబరిమల అయ్యప్ప ఆలయ ఆచార్యులు ఉన్ని కృష్ణన్ నంబూద్రి ఆచార్యత్వంలో దౌలతాబాద్ వాసుదేవశర్మ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కోమటిరెడ్డి చిన వెంకట్రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ జడల ఆదిమల్లయ్య, గుత్తా వెంకట్రెడ్డి మెమోరియల్ ట్రస్టు చైర్మన్ గుత్తా అమిత్రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ కూరెళ్ల లింగస్వామి, బాబ్జీ గురుస్వామి, చందా రవీందర్, సుధాకర్, పొన్నం లక్ష్మయ్య, గుండెబోయిన సైదులు, జడల చిన్నమల్లయ్య, కర్నాటి ఉప్పల్ వెంకట్రెడ్డి, వనమా వెంకటేశ్వర్లు, అయ్యప్ప స్వాములు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.