పచ్చదనంతో పల్లెలు పరిఢవిల్లేందుకు నాటిన ప్రతి మొక్కనూ సంరక్షించాలని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి కోరారు. హరితహారంలో భాగంగా భువనగిరి మండలంలోని తాజ్పూర్లో బుధవారం ఆయన మొక్కలు నాటారు. పచ్చదనం పెరిగితేనే భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించిన వారమవుతామని, ఈ మహా యజ్ఞంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
భువనగిరి కలెక్టరేట్ : పచ్చదనంతో పల్లెలు విరాజిల్లాలని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి అన్నారు. తెలంగాణకు హరితహారంలో భాగంగా మండలంలోని తాజ్పూర్ గ్రామంలో ఆయన మొక్కలు నాటి మాట్లాడారు. పచ్చదనం పెరిగితేనే భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించగలుగుతామన్నారు. ఈ సందర్భంగా మొక్కలకు సహకారం అందించిన టీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు ర్యాకల శ్రీనివాస్, తుంగతుర్తి రవిని ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందించారు.
కార్యక్రమంలో ఎంపీపీ నరాల నిర్మల, జడ్పీటీసీ సుబ్బూరు బీరుమల్లయ్య, డీఆర్డీఓ మందడి ఉపేందర్రెడ్డి, ఎంపీడీఓ నరేందర్రెడ్డి, ఏపీఓ బాలస్వామి, ఈసీ ముబాసిర్, పీఏసీఎస్ చైర్మన్ నోముల పరమేశ్వర్రెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు జనగాం పాండు, వైస్ ఎంపీపీ ఏనుగు సంజీవరెడ్డి, సర్పంచులు బొమ్మారపు సురేశ్, చిందం మల్లికార్జున్, అంకర్ల మురళీ, రైతు బంధు సమితి మండల కోఆర్డినేటర్ కంచి మల్లయ్య, టీఆర్ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి నీల ఓంప్రకాష్గౌడ్, టీఆర్ఎస్ జిల్లా నాయకులు అతికం లక్ష్మీనారాయణగౌడ్, బల్గూరి మధుసూధన్రెడ్డి, కేశవపట్నం రమేశ్, జక్క రాఘవేందర్రెడ్డి, పుట్ట వీరేశం, ఎంపీటీసీలు సామల వెంకటేశం, బొక్క కొండల్రెడ్డి, ఉప సర్పంచ్ ర్యాకల సంతోష, వార్డు సభ్యులు పాల్గొన్నారు. అనంతరం మండలంలోని తాజ్పూర్ గ్రామానికి చెందిన బాలరాజుకు కృత్రిమ కాలు ఏర్పాటు కోసం సీఎం సహాయ నిధి నుంచి మంజూరైన రూ.లక్ష ఎల్ఓసీని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి లబ్ధిదారుడికి అందజేశారు.