ప్రపంచ పర్యాటక కేంద్రమైన నాగార్జునసాగర్లో ఆదివారం పర్యాటకుల సందడి నెలకొంది. బుద్ధవనం, లాంచీస్టేషన్, డ్యామ్ పరిసరాలు పర్యాటకులతో నిండిపోయాయి. తెలంగాణ టూరిజం కృష్ణానదిలో ఏర్పాటు చేసిన లాంచీలో జాలీ ట్రిప్పునకు, నాగార్జునకొండకు వెళ్లేందుకు పర్యాటకులు ఆసక్తి కనబర్చారు.
బుద్ధవనంలో అష్టాంగ మార్గాలు, మహాస్థూపాన్ని పర్యాటకులు ఆసక్తిగా తిలకించారు. నల్లమల అడవుల సహజ అందాల మధ్య కృష్ణానదిలో లాంచీ ప్రయాణం, అంతర్జాతీయ స్థాయిలో నిర్మించిన బుద్ధవనం బాగుందని పర్యాటకులు తెలిపారు.
– నందికొండ, సెప్టెంబర్ 10