శాలిగౌరారం: ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో రూపుదిద్దుకుంటున్న బంగారు తెలంగాణలో ప్రతి ఒక్కరూ భాగ స్వాములు కావాలని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ అన్నారు.
మండల పరిధిలో పెర్కకొండారం గ్రామ కాంగ్రెస్ వార్డు సభ్యురాలు దేవరకొండ స్వప్న, వెంకన్న దంపతులు మరికొంత మంది నాయకులు హైదరాబాద్లోని ఎమ్మెల్యే కిశోర్కుమార్ నివాసంలో సోమవారం టీఆర్ఎస్ తీర్ధం పుచ్చుకున్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారికి కండువా కప్పి పార్టీలోకి స్వాగతించారు. బంగారు తెలం గాణలో ప్రతి ఒక్కరూ భాగ స్వాములు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో దుబ్బ వెంకన్న, నూక జానయ్య తదితరులు పాల్గొన్నారు.