సూర్యాపేట టౌన్: సంతోషిమాతా దేవాలయంలో జరిగిన సంతోషిమాతా జన్మదిన వేడుకల్లో విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తుల సహకారంతో ఆలయ పాలక మండలి తయారు చేయించిన బంగారు కిరీటాన్ని మంత్రి అమ్మ వారికి అలంకరించారు.
అదేవిధంగా రక్షా బంధన్ పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రత్యేకంగా రూపొందించిన బంగారు రాఖీని మంత్రి చేతుల మీదుగా అమ్మవారికి అలంకరింపజేశారు. అనంతరం మంత్రికి వేద పండితులు సంప్రదాయ పద్దతిలో ఆశీర్వచనం చేశారు.