రామన్నపేట, జూన్ 5 : సీఎం కేసీఆర్ పాలనలోనే రాష్ట్రం అన్ని రంగాల్లో సుభిక్షంగా ఉంటుందని జడ్పీ చైర్మన్ బండ నరేందర్రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని మల్లికార్జున గార్డెన్స్లో సోమవారం నిర్వహించిన నియోజకవర్గ స్థాయి విద్యుత్ ప్రగతి సభను ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్మన్ మాట్లాడుతూ విద్యుత్ రంగంలో తెలంగాణ రాష్ట్రం సాధించిన ప్రగతి వల్లే అనేక రంగాల్లో గణనీయమైన మార్పు వచ్చిందన్నారు. వ్యవసాయంతోపాటు పరిశ్రమలకు 24గంటల విద్యుత్ అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని తెలిపారు. విజన్ లేని నాయకులు అధికారంలోకి వస్తే తెలంగాణ మళ్లీ అంధకారమవుతుందని హెచ్చరించారు. ప్రజలకు నిరాటంకంగా అత్యవసర సేవలు అందిస్తున్న విద్యుత్ సిబ్బందికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
రైతులు, శ్రామికులకు భరోసా కల్పించిన ప్రభుత్వం
ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతులు, శ్రామికులకు నాణ్యమైన 24 గంటల విద్యుత్ అందిస్తూ వారిలో ధైర్యం, భరోసా కల్పించిందన్నారు. విద్యుత్ రంగంలో సాధించిన ప్రగతి వల్ల అనేక పరిశ్రమలు రాష్ర్టానికి తరలి వస్తున్నాయని తెలిపారు. దీంతో లక్షలాది మంది నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయన్నారు. ఎస్సీ, ఎస్టీలతోపాటు క్షౌర వృత్తిదారులు, ల్యాండ్రీ షాపులు, మర మగ్గాలకు సబ్సిడీపై విద్యుత్ ఇవ్వడం వల్ల వృత్తిదారుల జీవనోపాధి మెరుగు పడిందని చెప్పారు. 24గంటల ఉచిత విద్యుత్ సాధ్యం కాదన్న దాన్ని సుసాధ్యం చేసిన ఘనత సీఎం కేసీఆర్దేనని అన్నారు. పండుగ వాతావరణంలో తెలంగాణ సంబురాలు నిర్వహించుకుంటుంటే ప్రతిపక్ష నాయకులు మింగుడు పడక దిక్కుమాలిన మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు.
తమ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో చెప్పుకొనే ధైర్యం లేనివారికి సుభిక్షమైన, సుస్థిరమైన పాలన అందిస్తున్న సీఎం కేసీఆర్ను విమర్శించే అర్హత లేదన్నారు. అనంతరం తొమ్మిదేండ్లలో సాధించిన ప్రగతిపై డాక్యుమెంటరీని ప్రదర్శించారు. విద్యుత్ డీఈ సామల రవిప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ రేగట్టె మల్లికార్జున్రెడ్డి, ఎంపీపీలు కన్నెబోయిన జ్యోతీబలరాం, జెల్ల ముత్తిలింగం, జడ్పీటీసీలు తరాల బలరాం, మాధ ధనలక్ష్మి, మున్సిపల్ చైర్మన్లు కోమటిరెడ్డి చిన్న వెంకట్రెడ్డి, రాచకొండ శ్రీనివాస్, ఏడీఈలు నరేశ్కుమార్, మట్ట శ్రీకాంత్, ఏఈ జె.నర్సింహ, మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల ప్రదీప్రెడ్డి, వైస్ చైర్మన్లు కంభంపాటి శ్రీనివాస్, పోగుల నర్సింహ, పీఏసీఎస్ చైర్మన్ నంద్యాల భిక్షంరెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మందడి ఉదయ్రెడ్డి, రైతు బంధు సమితి మండలాధ్యక్షుడు బొక్క మాధవరెడ్డి, సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు, విద్యుత్ ఉద్యోగులు పాల్గొన్నారు.