మునుగోడు, మే 20 : 2025-26 సంవత్సరానికి సంబంధించి వన మహోత్సవ కార్యక్రమంలో పెంచే నర్సరీలపై మునుగోడు మండలంలోని పంచాయతీ కార్యదర్శులు, టెక్నికల్ అసిస్టెంట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లకు జమస్తానపల్లి నర్సరీలో మంగళవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి వై.శేఖర్ రెడ్డి మొక్కల పెంపకం, నర్సరీ నిర్వహణపై అవగాహన కల్పించారు. నర్సరీలలో ఇచ్చిన టార్గెట్ ప్రకారం వంద శాతం సర్వైవల్ ఉండేవిధంగా చూసుకోవాలన్నారు. మొక్కల పెంపకంలో అలసత్వం వహించరాదన్నారు. అలాగే పెన్షన్స్, స్వచ్ఛభారత్ మిషన్, ఉపాధి హామీ పనులపై సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ విజయభాస్కర్, ఎంపీఓ స్వరూప రాణి, ఇన్చార్జి ఏపీఓ నాగరాజు పాల్గొన్నారు.