రాజాపేట, డిసెంబర్ 9 : మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో మూడు రోజుల పాటు నిర్వహించే 9వ రాష్ట్ర స్థాయి క్రీడలు శనివారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా గురుకుల విద్యాలయాల సంస్థ జాయింట్ సెక్రటరీ బి.సక్రునాయక్ దీప ప్రజ్వలన చేసి క్రీడా పోటీలను ప్రారంభించారు. మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి జాతీయ ఒలపింక్, సొసైటీ జెండాను ఆవిష్కరించి జాతీయ గీతాన్ని అలపించారు. క్రీడా పోటీల్లో రాష్ట్ర స్థాయిలోని 8జోన్లకు సంబంధించిన 1,171మంది విద్యార్థులు మార్చ్ఫాస్ట్ నిర్వహించారు.
అనంతరం నిర్వహించిన సమావేశంలో సక్రునాయక్ మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలన్నారు. రాష్ట్ర స్థాయి క్రీడలను స్ఫూర్తిగా తీసుకోని జాతీయ, అంతర్జాతీయ స్థాయి స్థాయికి ఎదుగాలని సూచించారు. ఈ సందర్భంగా కబడ్డీ, వాలీబాల్, ఫుట్బాల్, బాల్ బ్యాడ్మింటన్, టెన్నికాయిట్, కార్యమ్స్తో పాటు చెస్ క్రీడా పోటీలు నిర్వహించారు. కార్యక్రమంలో ఎస్డీసీ చైర్మన్ శ్రీమతి అనూరాధ, ఆలేరు మార్కెట్ కమిటీ చైర్మన్ గోపగాని బాలమణీయాదగిరిగౌడ్, ఎంపీపీ గోపగాని బాలమణీయాదగిరిగౌడ్, సర్పంచ్ ఆడేపు ఈశ్వరమ్మాశ్రీశైలం, జిల్లా ప్రాంతీయ సమన్వయ అధికారులు శ్రీమతి రజిని, శ్రీరామ్ శ్రీనివాస్, ఎస్.అరుణ, ఉదయ్భాస్కర్, శ్రీనివాస్, కళాశాల ప్రిన్సిపాల్ నర్సింహాచారి, వార్డు సభ్యుడు జశ్వంత్ పాల్గొన్నారు.