నల్లగొండ : టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం పొందిన కుటుంబాలకు అందించే బీమా సౌకర్యం వారి కుటుంబాలకు భరోసానిస్తుందని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. ఆదివారం నార్కట్పల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఇటీవల ప్రమాదాల బారిన పడి మరణించిన టీఆర్ఎస్ పార్టీ కార్యకర్త వర్రే రవికుమార్కు కుటుంబానికి రూ.2లక్షల బీమ చెక్కును అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్యకర్తలు ప్రమాదవశాత్తు మృతి చెందితే వారి కుటుంబాలకు బాసటగా నిలవాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ ప్రమాద బీమా సౌకర్యం కల్పించారని పేర్కొన్నారు.
టీఆర్ఎస్ పార్టీ ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు ఉన్నారు.