జిల్లాలో అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. గురువారం నుంచే ఓటు వేసేందుకు ఓటర్లు పోటెత్తారు. గ్రామాలు, పట్టణాల్లో పోలింగ్ స్టేషన్ల వద్ద బారులుదీరారు. కొత్త ఓటర్లు, యువత పెద్ద సంఖ్యలో ఓటేశారు. కొత్తగా ఓటు వచ్చిన వారు మొదటిసారి ఉత్సాహంగా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
సాయంత్రం 5గంటలకు పోలింగ్ ముగిసిన తర్వాత కూడా అప్పటికే క్యూలో నిలబడిన ఓటర్లకు ఎన్నికల అధికారులు అవకాశం కల్పించారు. దాంతో కొన్నిచోట్ల రాత్రి వరకు పోలింగ్ జరిగింది. అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.