హుజూర్నగర్ ,ఏప్రిల్ 14: విద్యుత్ శాఖలోని ఆర్టిజన్ల డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ హుజూర్నగర్ విద్యుత్ సబ్ డివిజన్ కార్యాల యం ఎదుట ఆర్టిజన్ ఉద్యోగులు చేపట్టిన నిరసన కార్యక్రమం మంగళవారం నాటికి 7వ రోజు కు చేరింది. ఈ సందర్భంగా పలువురు ఉద్యోగులు మాట్లాడుతూ విద్యార్హతను బట్టి కన్వర్షన్ ప్రక్రియ చేపట్టాలన్నారు.
విద్యుత్ రంగంలో రాత్రింబవళ్లు శ్రమిస్తూ, కీలక పాత్ర పోషిస్తున్న తమపై ప్రభుత్వం, యాజమాన్యం తీవ్ర నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశా రు. దీర్ఘకాలంగా పరిష్కారానికి నోచుకోని సమస్యలను తక్షణమే పరిష్కరించాలన్నా రు. అధికారులు, ప్రభుత్వం స్పందించని పక్షం లో ఆందోళనను మరింత ఉధృతం చేస్తామన్నా రు. కార్యక్రమంలో ఎంవీఎన్ చార్యులు, పిడతల శ్రీనివాసరావు, బత్తిన రామయ్య, వేణు, శంకర్, తిరుపతిరావు తదితరులు ఉన్నారు.