నల్లగొండ : సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. సుమారు 500 మందికి పైగా రోగులకు, రోగుల సహాయకులకు భోజనం అందించారు.
ఈ కార్యక్రమాన్ని జడ్పీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డితో కలిసి ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తెలంగాణ అభివృద్ధి ప్రదాత కేసీఆర్ జన్మదినాన్ని నల్లగొండ నియోజకవర్గ వ్యాప్తంగా మూడు రోజుల పాటు ఘనంగా నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మండది సైదిరెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్, ఇతర నేతలు పాల్గొన్నారు.