కోదాడ, ఏప్రిల్ 14 : భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలను కోదాడ నియోజకవర్గ వ్యాప్తంగా మంగళవారం ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలతో పాటు స్వచ్ఛంద సంస్థలు, విద్యాసంస్థలు, దళిత, యువజన సంఘాల ఆధ్వర్యంలో ఆయన విగ్రహాలకు, చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పట్టణ అధ్యక్షుడు ఎస్కే నయీమ్, సత్యబాబు, కౌన్సిలర్ చీమ నరేష్ ఆధ్వర్యంలో పలువురు నాయకులు పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బస్టాండ్ ఎదుట అంబేద్కర్ విగ్రహానికి ఎంవి ఐ జిలాని, రాయపూడి చిన్ని ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులర్పించారు. అలాగే ఉస్మానియా అరుణతార జార్జిరెడ్డి వర్ధంతిని స్థానిక ఎమ్మెస్ కళాశాలలో పీడీఎస్యూ పూర్వ విద్యార్థులు నిర్వహించారు. ఈ పలువురు వక్తలు సందర్భంగా మాట్లాడుతూ అంబేద్కర్ ఆకాంక్షలు నెరవేర్చేందుకు ప్రతి ఒక్కరు కంకణబద్ధలు కావాలన్నారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన కృషి ఎనలేనివని కొనియాడారు.

‘అంబేద్కర్ ఆకాంక్షలను నెరవేర్చేందుకు కంకణ బద్దులమవుదాం’

‘అంబేద్కర్ ఆకాంక్షలను నెరవేర్చేందుకు కంకణ బద్దులమవుదాం’