నకిరేకల్ ఆగస్టు 21 : నకిరేకల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా చిరుమర్తి లింగయ్య పేరు ప్రకటించడంతో నకిరేకల్ నియోజకవర్గవ్యాప్తంగా సంబురాలు అంబరాన్నంటాయి. నకిరేకల్ క్యాంపు కార్యాలయానికి బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు శుభాకాంక్షలు తెలిపి శాలువాలతో సన్మానించారు. టపాసులు కాల్చి సంబురాలు చేసుకున్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాచకొండ శ్రీనివాస్, జడ్పీటీసీ మాద ధనలక్ష్మీనగేశ్, మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల ప్రదీప్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ మహేందర్రెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ప్రగడపు నవీన్రావు, ప్రధాన కార్యదర్శి కేశవరాజు, పట్టణాధ్యక్షుడు యల్లపురెడ్డి సైదిరెడ్డి, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
చిట్యాల : చిట్యాల మున్సిపల్ చైర్మన్ కోమటిరెడ్డి చినవెంకట్రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ శ్రేణులు చిట్యాలలో సంబరాలు చేసుకున్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ఏ.అయిలయ్య, ప్రధాన కార్యదర్శి కల్లూరి మల్లారెడ్డి, పట్టణ ప్రధాన కార్యదర్శి జిట్ట చంద్రకాంత్, సింగిల్ విండో వైస్ చైర్మన్ మెండె సైదులు, బీఆర్ఎస్ నాయకులు కర్నాటి ఉప్పల్రెడ్డి, సుంకరి యాదగిరి, వెల్మినేడు ఎంపీటీసీ దేవరపల్లి సత్తిరెడ్డి, పిట్టంపల్లి సర్పంచ్ ఈసం బాబు, కనకదుర్గ ఆలయం చైర్మన్ శీలా సత్యనారాయణ, గ్రంథాలయం చైర్మన్ దాసరి నర్సింహ, గుండెబోయిన సైదులు, రుద్రవరం యాదయ్య, మేడి నర్సింహ, మేడి ఉపేందర్, చిత్రగంటి ప్రవీన్, ఎండీ ముబిన్, జిట్టశేఖర్, జయారపు శివ, తుమ్మల నాగరాజురెడ్డి, బూరుగు క్రిష్ణయ్య పాల్గొన్నారు.
కట్టంగూర్ : నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు సీఎం కేసీఆర్ టికెట్ కేటాయించడంతో సోమవారం బీఆర్ఎస్ శ్రేణులు మండల కేంద్రంలో సంబురాలు జరుపుకున్నారు. పార్టీ కార్యాలయం నుంచి ఈదులూరు క్రాస్ రోడ్డు వరకు ర్యాలీ నిర్వహించి టపాసులు కాల్చి స్వీట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ తరాల బలరాములు, పార్టీ మండలాధ్యక్షుడు ఊట్కూరి ఏడుకొండలు, వైస్ ఎంపీపీ గడుసు కోటిరెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పోగుల నర్సింహ, ఎంపీటీసీలు పాలడుగు హరికృష్ణ, ఎడ్ల పురుషోత్తంరెడ్డి, సర్పంచులు వడ్డె సైదిరెడ్డి, పరుశరాములు, పిన్నపురెడ్డి నర్సిరెడ్డి, షేక్ జానీ పాషా, నాయకులు బీరెల్లి ప్రసాద్, పెద్ది బాలనర్సయ్య, మేకల రమేశ్, వడ్డె సైదిరెడ్డి, అంతటి శ్రీను, బొల్లెద్దు యాదయ్య, జనార్దన్, పులిగిల్ల వెంకన్న, పోతరాజు నగేశ్ పాల్గొన్నారు.
నార్కట్పల్లి : పట్టణంలోని బస్టాండ్ ఆవరణలో బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు దోసపాటి విష్ణుమూర్తి ఆధ్వర్యంలో బాణాసంచా కాల్చి సంబురాలు జరుపుకున్నారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.
కేతేపల్లి : కేతేపల్లిలో బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. పార్టీ మండలాధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మారం వెంకట్రెడ్డి, చిముట వెంకన్నయాదవ్, మార్కెట్ కమిటీ చైర్మన్ కె.ప్రదీప్రెడ్డి, సర్పంచులు, నాయకులు పాల్గొన్నారు.
రామన్నపేట : మండల కేంద్రంలో బీఆర్ఎస్ శ్రేణులు బాణాసంచా కాల్చి స్వీట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మందడి ఉదయ్రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ నంద్యాల భిక్షంరెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కంభంపాటి శ్రీనివాస్, మండల ప్రధాన కార్యదర్శి పోశబోయిన మల్లేశం, నాయకులు బందెల రాములు, కన్నెబోయిన బలరాం, గొరిగె నర్సింహ, దోమల సతీశ్, ఉప్పు ప్రకాశ్, బొక్క పురుషోత్తంరెడ్డి, పోతరాజు సాయికుమార్, జాడ సంతోష్, కూనూరు మత్తయ్య, గర్దాసు విక్రం, ఎండీ నాసర్, మల్లం మల్లేశం, బొడ్డు అల్లయ్య, ఆవుల నరేందర్, బడుగు రఘు పాల్గొన్నారు.
నకిరేకల్, ఆగస్టు 21 : సీఎం కేసీఆర్ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని.. నకిరేకల్ నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో మూడోసారి ఎమ్మెల్యేగా గెలుస్తానని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. సోమవారం నకిరేకల్ క్యాం పు కార్యాలయంలో విలేకరులతో ఆయన మా ట్లాడారు. నకిరేకల్ నియోజకవర్గ అభివృద్ధికి అ హర్నిశలు కృషి చేస్తున్న తనకు మరోసారి టికెట్ ఇచ్చి ఎమ్మెల్యేగా అవకాశం కల్పించినందుకు సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. టికెట్ వచ్చిందని సంబురపడిపోనని, ఎమ్మెల్యేగా గెలిచి సీఎం కేసీఆర్కు బహుమతిగా ఇస్తానన్నారు. నాలుగున్నరేండ్లలో పార్టీ నిర్ణయాలకు, బీఆర్ఎస్ అధిష్టానానికి కట్టుబడి ఉన్నానని, క్రమశిక్షణతో ఉన్నందుకే టికెట్ కేటాయించారన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఇంటింటికీ తెలియజేయాలని నాయకులు, కార్యకర్తలకు సూచించారు.