జై బీఆర్ఎస్.. జయహో ఆలేరు అంటూ ఆలేరు నియోజకవర్గ ప్రజానీకం కదంతొక్కారు. నింగిని తాకే అభిమానం, నూతనోత్సాహంతో గులాబీ దండు కదిలింది. భారీగా తరలివచ్చిన జనంతో ఆలేరు ప్రజా ఆశీర్వాద సభ గ్రాండ్ సక్సెస్ అయ్యింది.
దాంతో బీఆర్ఎస్ కార్యకర్తల్లో రెట్టింపు ఉత్సాహం కనిపించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ తనదైన శైలిలో కాంగ్రెస్పై విరుచుకుపడటం, ఆలేరుకు వరాలు కురిపించడంతో సభా ప్రాంగణమంతా జై తెలంగాణ, జై కేసీఆర్, జై సునీతమ్మ అంటూ నినాదాలు, కేరింతలతో మార్మోగింది.