మునుగోడు, డిసెంబర్ 21 : ఆటో కార్మికులకు తగిన న్యాయం చేయాలని ఏఐటీయూసీ జిల్లా గౌరవాధ్యక్షుడు చాపల శ్రీను ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో ఆటో కార్మికులతో కలిసి గురువారం నిరసన ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో కార్మికులను రోడ్డున పడేసిందన్నారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణంతో ఆటోలు నడుపుతున్న వారికి పూట గడవని పరిస్థితులు నెలకొన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆటో కార్మికులకు నెలకు రూ.15వేలు చెల్లించి ఆదుకోవాలని కోరారు. కార్యక్రమంలో జానీమియా, బండారు శంకర్, ఆటో కార్మికులు పాల్గొన్నారు.