నీలగిరి,డిసెంబర్ 1: ఎయిడ్స్ నివారణపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి అన్నారు. ప్రపంచ ఎయిడ్స్ నివారణ దినోత్సవం సందర్భంగా గురువారం క్లాక్టవర్ సెంటర్లో నిర్వహించిన అవగాహన ర్యాలీని జెండా ఊపి ఆయన ప్రారంభించారు. అనంతరం ఐఎంఏ భవన్లో సదస్సులో ఆయన మాట్లాడారు. ఎయిడ్స్ మహామ్మారిని పారదోలడానికి జిల్లా యంత్రాంగంతో పాటు స్వచ్ఛంద సంస్థలు భాగస్వాములు కావాలని, ప్రజలను ఈ వ్యాధి పట్ల చైతన్య పరిచేందుకు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులను ప్రభుత్వం అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తామన్నారు. వారికి మెరుగైన వైద్య సేవలు అందించడంతో పాటు వారి పిల్లలకు రెసిడెన్షియల్ పాఠశాలలు, వసతి గృహాలలో చేర్పించి విద్యాబోధన అందిస్తామన్నారు.
ఎయిడ్స్కు మందులు అందుబాటులోకి రాలేదని, హెచ్ఐవీని పూర్తిగా నిర్మూలించడానికి దేశ, విదేశాల్లో పరిశోధనలు జరుగుతున్నాయని కొత్త మందులు అందుబాటులోకి వస్తున్నాయన్నారు. అనంతరం జిల్లాలో వ్యాధి నిర్మూలనకు తోడ్పాటునందించిన వివిధ ఉద్యోగులకు ఐఎంఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ ఏసీహెచ్ పుల్లారావు ప్రశంసాపత్రాలు, మెమెంటోలు అందజేశారు. కార్యక్రమంలోనల్లగొండ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, డీఎంహెచ్ఓ డాక్టర్ కొండల్రావు, సూపరింటెండెంట్ డాక్టర్ లావుడి లచ్చునాయక్, డాక్టర్ సుచరిత, ప్రోగ్రాం మేనేజర్ సుధాకర్, నాయకులు రావుల శ్రీనివాస్రెడ్డి, సిరిగిరి సురేశ్రెడ్డి పాల్గొన్నారు.