చౌటుప్పల్,అక్టోబర్ 31: బీఆర్ఎస్ గెలుపు కోసం ప్రతి కార్యకర్త సైనికుల్లా పనిచేయాలని ఆ పార్టీ మండలాధ్యక్షుడు గిర్కటి నిరంజన్ గౌడ్ అన్నారు. మండలకేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన గ్రామశాఖ కమిటీల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలను గడపగడపకూ వివరించాలన్నారు. ఇందుకోసం ప్రతి కార్యకర్త నడుంబిగించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఢిల్లీ మాధవరెడ్డి, ముప్పిడి శ్రీనివాస్ గౌడ్, చిన్నం బాలరాజు, బచ్చ రామకృష్ణా, దొడ్డి లింగస్వామి, పిట్టల శంకరయ్య, పాక రమేశ్ యాదవ్, బత్తుల సింహాచలం, రిక్కల బాలకృష్ణారెడ్డి పాల్గొన్నారు.
ఎమ్మెల్యే కూసుకుంట్ల గెలుపునకు కార్యకర్తలు కృషి చేయాలి
బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి గెలుపుకోసం కార్యకర్తలు కృషి చేయాలని ఆ పార్టీ మున్సిపాలిటీ అధ్యక్షుడు ముత్యాల ప్రభాకర్రెడ్డి అన్నారు. స్థానిక బీఆర్ఎస్ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన బూత్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి కార్యకర్త ఇంటింటికీ సీఎం కేసీఆర్ ప్రకటించిన మ్యానిఫెస్టోను వివరించాలన్నారు. అంతేకాకుండా ఈ ప్రాంతంలో జరిగిన అభివృద్ధిని కూడా గుర్తు చేయాలన్నారు. కార్యక్రమంలో కొరగోని లింగస్వామి, ఆలె నాగరాజు, బండమీద మల్లేశం, ఊడుగు మల్లేశం గౌడ్, గుండెబోయిన వెంకటేశం యాదవ్, బొమ్మిరెడ్డి వెంకట్రెడ్డి, ఊడుగు రమేశ్ గౌడ్, హరీశ్, కానుగుల వెంకటయ్య, కట్కూరి కిరణ్, తడక అమర్ పాల్గొన్నారు.
ప్రభుత్వ పథకాలు ఇంటింటికీ తీసుకెళ్లాలి : జడ్పీటీసీ సురేందర్రెడ్డి
బీఆర్ఎస్ ప్రభు త్వం అమలు పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు జిల్లా ఫైనాన్స్ కమిటీ సభ్యుడు, జడ్పీటీసీ పాశం సురేందర్ రెడ్డి కోరారు. మండలకేంద్రంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి సూచన మేరకు మండలాధ్యక్షుడి ద్వారా గ్రామశాఖ అధ్యక్షులకు కేసీఆర్ భరోసా మ్యానిఫెస్టో కాపీలతో పాటు ఎన్నికల ప్రచార సామాగ్రిని అందజేసినట్లు వెల్లడించారు. స్థానికంగా ఉన్న ప్రజా ప్రతినిధులతో బీఆర్ఎస్ శ్రేణులు ప్రచారంలో పాల్గొనాలని సూచించారు. గ్రామంలోని ప్రతి గడపకు తిరుగుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధ్ది సంక్షేమ పథకాలను వివరించాలని కోరారు ఈ ఎన్నికల్లో మునుగోడులో గులాబీ జెండా ఎగరాల్సిన అవశ్యకత చాలా ఉందన్నారు.
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అసమర్థత కారణంగా ఆయన నాలుగేండ్ల కాలంలో పదేండ్ల వెనుకబాటుకు గురైందన్నారు. నియోజకవర్గంలోని శివన్నగూడెం, లక్ష్మణాపురం ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు ప్రభుత్వం సిద్ధ్దంగా ఉన్నట్లు తెలిపారు. ప్రాజెక్టులు పూర్తి కావాలంటే అటు రాష్ట్రంలో ఇటు మునుగోడులో గులాబీ జెండా ఎగురాల్సిన అవసరం ఉందన్నారు.